అన్వేషించండి

Atmeeya Sammelanam: ఆత్మీయ సమ్మేళనాల్లో విషాదాలు! తాజాగా గుండెపోటుతో ఒకరు మృతి

Atmeeya Sammelanam: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీనియర్ కార్యకర్త ఒకరు గుండెపోటుతో మరణించారు. 

Atmeeya Sammelanam: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల వద్దకు వెళ్తున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఇటీవల  అగ్నిప్రమాదం జరిగి కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఒకరు చనిపోయారు. సీనియ‌ర్ కార్యకర్త  ధీరావత్ నాను సింగ్ గుండెపోటుతో మృతి చెందారు.

చీకటి మామిడిలో ఏప్రిల్ 21న జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో.. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ఆయనను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే దారిలోనే ధీరావత్ నాను సింగ్ ప్రాణాలు కోల్పోయారు. దీరావత్ నాను సింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాంచల తండాకు చెందిన పార్టీ కార్యకర్త. చాలా కాలంగా పార్టీలో యాక్టివ్ గా ఉంటూ పార్టీ కోసమే పని చేస్తున్నట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. చివరికి పార్టీ కోసం సమావేశానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. మృతిచెందిన ధీరావత్ నాను సింగ్ కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

చీమలపాడు ఆత్మీయసమ్మేళనంలో  అగ్ని ప్రమాదం

పది రోజుల క్రితం ఖమ్మం జిల్లా వైరా నియోజవర్గం కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఈ నిప్పు రవ్వలు స్థానికంగా ఉన్న గుడిసెపై పడటంతో మంటలు చెలరేగాయి. గుడిసెను అంటుకున్న మంటల్ని చల్లార్చేందుకు వెళ్లి పలువురు కార్యకర్తలు లోపలికి వెళ్లారు. అయితే ఆ గుడిసెలో గ్యాస్ సిలిండర్ ఉండటాన్ని గుర్తించకపోవడం, ఆపై భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

చీమ‌ల‌పాడుఆత్మీయ సమావేశం పరిసరాల్లో జరిగిన దుర్ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఖ‌మ్మం జిల్లా పార్టీ నేతలతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందివ్వాలని ఆదేశించారు. మృతుడి కుటుంబం, క్ష‌త‌గాత్రుల‌ ఫ్యామిలీలను ఆదుకుంటామన్నారు కేటీఆర్. 

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి పూరి గుడిసెలో సిలిండర్ పేలడానికి ఎలాంటి సంబంధం లేదని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి ఎంపీ నామా పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన నామా నాగేశ్వర రావు.. ఆత్మీయ సమ్మేళనం సభ ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉందని, సమావేశం ప్రారంభమయ్యే సమయంలో ఓ గుడిసెలో సిలిండర్ పేలిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, కొంత మంది కాళ్లు తెగిపోయాయని ఎంపీ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయిస్తామని నామా స్పష్టం చేశారు.

జగిత్యాలలో గుండెపోటుకు గురైన కార్యకర్త

జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా పార్టీ శ్రేణులు, కవిత  అభభిమానులు భారీగా తరలివచ్చి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంతలో పార్టీ లీడర్‌ బండారి నరేందర్ కుప్పకూలిపోయారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంతో నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన చనిపోయారు. అప్పటి వరకు సందడిగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంతో నిండిపోయింది. రైతు నేత నరేందర్ మృతి తెలియగానే అంతా ఒక్కసారిగా కూలబడిపోయారు. విషయం తెలుసుకున్న కవిత అక్కడకు చేరుకొని నరేందర్ మృతికి సంతాపం తెలిపారు. భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరేందర్ మృతితో జగగిత్యాలలో జరగాల్సిన ఆత్మీయ సమావేశం రద్దైంది. ఇతర కార్యక్రమాలను కూడా రద్దు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget