అన్వేషించండి

Karimnagar: ఆదిలాబాద్ - కరీంనగర్ జిల్లాల మధ్య బ్రిడ్జి నిర్మాణం కోసం కీలక ముందడుగు

Karimnagar: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈ మధ్య టెండర్ పూర్తవగా.. తాజాగా పరిపాలన అనుమతులు లభించాయి.  

Karimnagar: ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ ఉన్న వంతెన వర్షాకాలం మొదలవగానే వరదలకు గురై  రాకపోకలకు అంతరాయం కలగడం సర్వసాధారణంగా మారింది. ఇక కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన.. గోదావరి నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈమధ్య టెండర్ పూర్తయింది. మొదట రూ.100 కోట్లతో పైవంతెన నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు.. తరువాత 2022-23 అదనపు బడ్జెట్ లో రూ.164 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇందుకోసం పరిపాలన అనుమతి ఉత్తర్వులు ఈ సంవత్సరం మే 30న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నిధుల మంజూరు టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి మంచిర్యాల పట్టణం మీదుగా జగదల్పూర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారికి ఈ వంతెన మార్గాన్ని అనుసంధానం  చేయనున్నారు. 

బ్రిడ్జి నిర్మాణంతో తగ్గనున్న 25 నుంచి 30 కి.మీల దూరం..

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ రాజీవ్ రహదారి నుంచి అంతర్గామ్ మీదుగా గోదావరి నది పైవంతెన మార్గం  ఏర్పడనుంది. రాజీవ్ రహదారిపై వెహికిల్స్ రద్దీ పెరగడంతో పాటు ముఖ్యంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు, ఉమ్మడి జిల్లాల ప్రజల రాకపోకలకు 25 నుంచి 30 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. ఎగువ, దిగువ దారులతో కిలోమీటర్ నర పొడవున నిర్మించే ఈ వంతెన గోదావరి నది వరదకు తట్టుకునేలా ఉండాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన దగ్గరగా ఈ వంతెన నిర్మింస్తుండటంతో గేట్లు  ఎత్తినప్పుడు వరద కిందికి వస్తోంది. ప్రతిపాదిత ప్రదేశాల్లో నేల పరీక్షలు జరపాలి. భూగర్భ సర్వే విభాగం, భారీ నీటిపారుదల పర్యావరణ అనుమతులను పొందాలి. అంతర్గాo వద్ద రైల్వే పైవంతెన నిర్మించి వందేళ్ళు దాటింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చెక్కుచెదరకుండా నిలబడింది. ఇక్కడే రైల్వే వారు మూడో మార్గం కోసం రెండవ వంతెన నిర్మించారు. 

వంతెన నిర్మాణానికి భూసేకరణ అవసరం లేదు...

ఈ ప్రదేశంలోని అంతర్గాం మంచిర్యాల పట్టణం మీదుగా కాకుండా బైపాస్ దారి మీదుగా పైవంతెన నిర్మిస్తే అన్ని విధాలుగా బాగుంటుందని భావిస్తున్నారు. బసంత్ నగర్ రాజీవ్ రహదారి నుంచి వంతెన రోడ్డు అనుసంధానంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. వంతెన నిర్మాణానికి భూసేకరణ అవసరం లేదు. మంచిర్యాల పట్టణం మీదుగా కాకుండా బైపాస్ దారి మీదుగా అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. అందుకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై రహదారులు, భవన శాఖ అధికారులు నాలుగేళ్లుగా సర్వేలు చేస్తున్నా పరిష్కారం దొరకడం లేదు. నిర్మాణానికి సంబంధించిన టెండరు ప్రక్రియ పూర్తి కావడంతో రహదారులు, భవన శాఖ చీఫ్ ఇంజినీర్ సమక్షంలో ఈ నెల 7న హైదరాబాద్ లో సమావేశం కానుంది. 

త్వరగా పూర్తి చేయాలంటున్న ప్రజలు..

ఈసారి జరగనున్న సమావేశంలో పూర్తి స్థాయిలో ప్లానింగ్ తో అధికారులు నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు అన్ని అనుమతులు పూర్తయ్యాయి కాబట్టి వెనువెంటనే వంతెన నిర్మాణం ప్రారంభం అవుతుందని అధికారులు హామీ ఇస్తున్నారు. ఏదేమైనా దశాబ్దాల కల నెరవేరడంతో అనుమతులు ఇచ్చినంత వేగంతో పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget