అన్వేషించండి

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

ఆదివారం కావడంతో పాఠశాల ఆవరణంలో ఉన్న బావిని శుభ్రం చేయాలని విద్యార్థులకు చెప్పాడు హాస్టల్ వార్డెన్. దీంతో మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి శ్రీకర్ బావిలోకి దిగాడు.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల తిమ్మాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. సెయింట్ ఆంథోనీ స్కూల్‌ సమీపంలోని బావిలో చెత్త తొలగించేందుకు వెళ్లిన ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. శ్రీకర్ అనే విద్యార్థిని ఇతర విద్యార్థులతో వార్డెన్ చెప్పడంతో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయాడు. 

అసలేం జరిగింది?

ఆదివారం కావడంతో పాఠశాల ఆవరణంలో ఉన్న బావిని శుభ్రం చేయాలని విద్యార్థులకు చెప్పాడు హాస్టల్ వార్డెన్. దీంతో మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి శ్రీకర్ బావిలోకి దిగాడు. అందులో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తూ ఉండగా అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో పాటు సాయంత్రం సమయం కావడంతో ఊపిరాడక నీటిలో మునిగి చనిపోయాడు. 

అప్రమత్తమైన స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో బావిలోకి దిగిన రక్షణ సిబ్బంది తాడుతో విద్యార్థి మృతదేహాన్ని బయటకు లాగారు. రెండు మూడు వారాలకు ఒకసారి పాఠశాల ఆవరణలో ఉన్న ప్రమాదకరమైన ఈ బావిలోని క్లీనింగ్‌ను పిల్లలతో చేయిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నవీన్ ,శశాంక్ ,లక్ష్మీ నివాస్, హరీష్ రెడ్డి, శ్రీకర్ అనే విద్యార్థులకు ఈ పనిని వార్డెన్ పురమాయించారు. అయితే సమయానికి ఎవరు రక్షించే పరిస్థితి లేకపోవడంతో  నీటిలో మునిగాడు.

మారం శ్రీకర్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామం. అతని తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధా. శ్రీకర్ తండ్రి శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రామకృష్ణ కాలనీలో తాత అమ్మమ్మ ఉంటారు. ఈ సంవత్సరమే సెయింట్ ఆంథోనీ పాఠశాలలో హాస్టల్లో ఉంచి శ్రీకర్‌ను చదివిస్తున్నారు. ఇప్పుడు ఈ బాలుడి మృతి అతడి తల్లిదండ్రులు, చెల్లి తీవ్రంగా రోదిస్తున్నారు.

స్కూల్ పిల్లలతో ప్రమాదకరమైన పనులు చేయించడం మంచిది కాదని తెలిసిన వార్డెన్ నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం తమ ఇంటి దీపాన్ని కోల్పోయిందని స్థానికులు అంటున్నారు. జరిగిన ఘటన పట్ల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాలని పంపిస్తే ప్రమాదకరమైన పనులు చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో వార్డెన్‌ని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కి తరలించారు.

స్కూల్లోనే ధర్నా..

పూర్తిగా యజమాన్యం నిర్లక్ష్యంతోని విద్యార్థి చనిపోవడంతో అక్కడి నుంచి మృతదేహం తీసేది లేదని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులతో తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి ఎల్ఎండిఎస్ఐ ప్రమోద్ రెడ్డి మాట్లాడి నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎంపీడీవో రవీందర్ రెడ్డి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి ఎంపీ ఓ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని సదరు పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ హామీలతో శాంతించిన బంధువుల రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget