అన్వేషించండి

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

ఆదివారం కావడంతో పాఠశాల ఆవరణంలో ఉన్న బావిని శుభ్రం చేయాలని విద్యార్థులకు చెప్పాడు హాస్టల్ వార్డెన్. దీంతో మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి శ్రీకర్ బావిలోకి దిగాడు.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల తిమ్మాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. సెయింట్ ఆంథోనీ స్కూల్‌ సమీపంలోని బావిలో చెత్త తొలగించేందుకు వెళ్లిన ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. శ్రీకర్ అనే విద్యార్థిని ఇతర విద్యార్థులతో వార్డెన్ చెప్పడంతో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయాడు. 

అసలేం జరిగింది?

ఆదివారం కావడంతో పాఠశాల ఆవరణంలో ఉన్న బావిని శుభ్రం చేయాలని విద్యార్థులకు చెప్పాడు హాస్టల్ వార్డెన్. దీంతో మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి శ్రీకర్ బావిలోకి దిగాడు. అందులో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తూ ఉండగా అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో పాటు సాయంత్రం సమయం కావడంతో ఊపిరాడక నీటిలో మునిగి చనిపోయాడు. 

అప్రమత్తమైన స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో బావిలోకి దిగిన రక్షణ సిబ్బంది తాడుతో విద్యార్థి మృతదేహాన్ని బయటకు లాగారు. రెండు మూడు వారాలకు ఒకసారి పాఠశాల ఆవరణలో ఉన్న ప్రమాదకరమైన ఈ బావిలోని క్లీనింగ్‌ను పిల్లలతో చేయిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నవీన్ ,శశాంక్ ,లక్ష్మీ నివాస్, హరీష్ రెడ్డి, శ్రీకర్ అనే విద్యార్థులకు ఈ పనిని వార్డెన్ పురమాయించారు. అయితే సమయానికి ఎవరు రక్షించే పరిస్థితి లేకపోవడంతో  నీటిలో మునిగాడు.

మారం శ్రీకర్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామం. అతని తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధా. శ్రీకర్ తండ్రి శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రామకృష్ణ కాలనీలో తాత అమ్మమ్మ ఉంటారు. ఈ సంవత్సరమే సెయింట్ ఆంథోనీ పాఠశాలలో హాస్టల్లో ఉంచి శ్రీకర్‌ను చదివిస్తున్నారు. ఇప్పుడు ఈ బాలుడి మృతి అతడి తల్లిదండ్రులు, చెల్లి తీవ్రంగా రోదిస్తున్నారు.

స్కూల్ పిల్లలతో ప్రమాదకరమైన పనులు చేయించడం మంచిది కాదని తెలిసిన వార్డెన్ నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం తమ ఇంటి దీపాన్ని కోల్పోయిందని స్థానికులు అంటున్నారు. జరిగిన ఘటన పట్ల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాలని పంపిస్తే ప్రమాదకరమైన పనులు చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో వార్డెన్‌ని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కి తరలించారు.

స్కూల్లోనే ధర్నా..

పూర్తిగా యజమాన్యం నిర్లక్ష్యంతోని విద్యార్థి చనిపోవడంతో అక్కడి నుంచి మృతదేహం తీసేది లేదని బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులతో తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి ఎల్ఎండిఎస్ఐ ప్రమోద్ రెడ్డి మాట్లాడి నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎంపీడీవో రవీందర్ రెడ్డి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి ఎంపీ ఓ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని సదరు పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ హామీలతో శాంతించిన బంధువుల రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget