అన్వేషించండి

Telangana Cabinet: మరోసారి ఢిల్లీకి రేవంత్ - ఈ సారి కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఖాయమే !?

ఆరుగురు కొత్త అమాత్యులు ఎవరో ఇక తెలనుంది. ఇందు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండి మంత్ర వర్గ విస్తరణపై మంతనాలుజరపనున్నారు

CM Revanth Reddy:    సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ మకాం వేయనున్నారు. రాజస్థాన్ లో ఓ వివాహవేడుకకు హజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన  సీఎం. రేపు, ఎళ్లుండి  అక్కడే ఉండి  క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశాలున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం  నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈలోపే కొత్త క్యాబినెట్ కొలువు తీరవచ్చన్న చర్చ సాగుతోంది.  ఇప్పటికే క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు ఎవరికి  దక్కనున్నాయో ఆ అంశాలపై పూర్తి క్లారిటీతో సీఎం రేవంత్ రెడ్డి ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని గాంధీ భవన్ లోని సీనియర్ కాంగ్రెస్ మెన్ చెబుతున్నారు. 

మంత్రి వర్గ విస్తరణకు వేళయిందా..?   

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  ఏడాది కావోస్తోంది.  2023 డిసెంబర్  7 న  రేవంత్ సీఎంగా మరో 11 మంది మంత్రులతో రేవంత్ సర్కార్  నడుస్తోంది.  శాసన సభ లో సభ్యుల సంఖ్యను బట్టి క్యాబినెట్ లో మరో ఆరుగురికి  మంత్రి పదవుల ఇవ్వాల్సి ఉంది.  కొత్త మంత్రివర్గం ఏర్పడినప్పుడే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కాని వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో  మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత  శావ్రణ మాసం కావడంతో మంచి రోజులు లేవని  అప్పుడు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారు.  ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ సారి క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ఇదే  విషయమై  హై కమాండ్ తో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు చక్కర్లు కొట్టాయే తప్ప   ఈ దిశగా చర్చే జరగలేదని ఢిల్లీ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డే ప్రకటించిన  సంగతి తెలిసిందే. అయితే ఏడాది పాటు హోం మంత్రి వంటి కీలక శాఖలకు మంత్రి లేకుండానే కాంగ్రెస్  ప్రభుత్వం పాలన సాగిస్తోంది.   ఐదేళ్ల కాలపరిమితిలో ఇప్పటికే ఒక ఏడాది పూర్తయింది. మరో నాలుగేళ్లు మాత్రమే  అధికారంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగనున్న నేపధ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.  అయితే  ఏడాది పాలన పూర్తి కావడం,  డిసెంబర్ 9వ తేదీ వరకు పాలన విజయోత్సవాలు,  తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, తెలంగాణ జాతీయ గీతం ఆమోదం వంటి  కీలక  అంశాలు పూర్తి కావడంతో ఇక  మంత్రి వర్గ విస్తరణ  ఉండనుందన్న వార్తలు గాంధీ భవన్ లో చక్కర్లు కొడుతున్నాయి.  ఈ దిశగా ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.  రేవంత్ సహా హైకమాండ్ ముఖ్య నేతలను కాకా పట్టే పనిలో ఉన్నారు. 

 ఆరుగురు అమాత్యులు  ఎవరు..?

రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో 11 మంది మంత్రులు ఉండగా ఉమ్మడి జిల్లాల వారీగా  చూస్తే,  ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. అందులో ఉప ముఖ్యమంత్రి గా సీనియర్ నేత  మల్లు భట్టి విక్రమార్క , మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావులకు అవకాశం దక్కింది. నల్గొండ నుండి  కొమటి రెడ్డి వెకంటరెడ్డి,  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  కరీంనగర్ జిల్లా నుండి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా నుండి   సీతక్క,  కొండా సురేఖ,  మహబూబ్ నగర్ జిల్లా నుండి  జూపల్లి కృష్ణారావు,  మెదక్ జిల్లా నుండి దామోదర రాజనర్సింహలు  ఉన్నారు.  ఆదిలాబాద్,  నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్  జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు.  ఇప్పుడు ఈ జిల్లా సమీకరణాలను బట్టి మంత్రి వర్గం ఎలా ఉండనుందన్న చర్చ సాగుతోంది. ఆరు క్యాబినెట్ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది.   ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు,  గడ్డం వినోద్, గడ్డం వివేక్ ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది.  ఇక నిజామాబాద్ నుంచి పి. సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు లు పోటీ పడుతున్నారు. అయితే సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది.  హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలనుండి ఎవర్ని  ఎంపిక చేస్తారన్న చర్చ సాగుతోంది.  రంగారెడ్డి జిల్లాలో   మలా రెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. హైదరాబాద్ నుండి  ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే  మాత్రమే ఉపఎన్నికలో కంటోన్మెంట్ నుండి గెలిచారు. అయితే రంగారెడ్డి జిల్లా కోటాలో
అయితే మల్ రెడ్డి రంగారెడ్డి,  హైదరాగా బాద్ నుండి పార్టీ మారిన దానం నాగేందర్,  హైదరాబాద్ నుండి  మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్, అజారుద్ధీన్ లు పోటీ పడతున్నారు. అయితే ఇదే మైనార్టీ కోటా నుండి మా జీ మంత్రి షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరిలో ఎవరికి  అవకాశం దక్కునందా అన్న  ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. అయితే మహబుబ్ నగర్ నుండి  ఇప్పటికే జూపల్లి కృష్ణారావు క్యాబినెట్ లో ఉండగా మక్తల్ నుండి ఎన్నికయిన వాకిటి శ్రీహరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. ముదిరాజ్ లకు క్యాబినెట్ లో అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హమీ మేరకు శ్రీహరికి  అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.  నల్గొండ జిల్లా నుండి ఇద్దరు మంత్రులు  ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉండగా, తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటి రెడ్డి రాజ్ గోపాల్ అదిష్టానాన్ని కోరుతున్నారు. అయితే   ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్  ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. అదే జిల్లా నుండి ఇతర సామాజిక వర్గాలకు చెందిన బాలు నాయక్, బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.  

ఢిల్లీలో హైకమాండ్ ఏం చేస్తుందో...?

మంత్రి వర్గ విస్తరణపై  సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే  హైకమాండ్ దగ్గర ఇప్పటికే పలువురు తెలంగాణ సీనియర్ నేతలు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని పైరవీలు చేస్తోన్న నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాను  హైకమాండ్  ఓకే చెప్తుందా లేదా  ఒకరిద్దరిని మారుస్తూ కొత్త జాబితా ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.  అదే రీతిలో పార్టీ మారిన దానం, వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు  తమకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నైపధ్యంలో బీఆర్ఎస్ వీడి పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి కట్టబెడతారా లేదా అన్నది చూడాలి.  అంతే కాకుండా  జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో  బీఆర్ఎస్ నుండి  మాజీ మంత్రులను  పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని , అలా చేరిన మాజీలకు తిరిగి మంత్రి పదవి ఇవ్వాలన్న చర్చ సాగుతోంది. అయితే ఇందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. అంతే కాకుండా ఆరు మంత్రి పదవులను భర్తీ చేస్తారా లేక  ఒకటి రెండు మంత్రి పదవులను భర్తీ చేయకుండా అట్టిపెట్టి  ఉంచుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఇప్పటికే పార్టీలో సీనియర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మంత్రి పదవులు దక్కని వారు పార్టీ లైన్ దాటి పని చేయకూడదంటే అలా  ఒకటి రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉంచడం ద్వారా వారిని అదుపుచేయవచ్చ అన్న ఆలోచనలోను హైకమాండ్ ఉండవచ్చని గాంధీ భవన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతే కాకుండా ఆపరేషన్ ఆకర్ష్  చేపట్టాలంటే బీఆర్ఎస్ నుండి వచ్చే సీనియర్లకు ఆ మంత్రి పదవులను గాలం వేసి లాగవచ్చన్న వ్యూహం కూడా ఉంటుందని చెబుతున్నారు.  అయితే ఈ వారంలో  ఈ సస్పెన్స్ కు ఇక తెరపడుతుందని చెబుతున్నారు.  ఏది ఏమైనా ఈ రెండు మూడు రోజుల్లో మాత్రం కొత్త క్యాబినెట్ కొలువు తీరే అవకాశం ఉందని, మంత్రులతో పాటు పాత మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉందని  హస్తం నేతలు చెబుతున్నారు. 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
Embed widget