అన్వేషించండి

YS Jagan : అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ 

YS Jagan : దాదాపు ఆరేళ్ల తర్వాత వైఎస్‌ జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆయన రాక సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు.

YS Jagan : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోనీ సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టు వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన ఈ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో దాదాపు అరగంటపాటు గడిపారు. 11.40గంటలకు కోర్టుకు వచ్చిన జగన్ 12.15గంటలకు బయటకు వెళ్లిపోయారు. 

జగన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయలుదేరారు. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడ్నుంచి నాంపల్లి కోర్టుకు పదకొండున్నరకు చేరుకున్నారు. పన్నెండున్నర వరకు కోర్టులో ఉన్నారు. అక్కడ విచారణ పూర్తి అయిన తర్వాత జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లారు. 

చాలా కాలంగా జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్‌లో ఉండటం లేదు. చాలా ఏళ్ల తర్వాత లోటస్ పాండ్‌కు వచ్చిన జగన్ అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి కొందరు నేతలను కలిసి మళ్లీ బేగంపేటకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్తారు. 
 
జగన్ మీదున్న సీబీఐ, ఈడీ  కేసులు 2012లో విచారణ ప్రారంభమయ్యాయి. అక్రమ ఆస్తులు, క్విడ్ ప్రో కో ద్వారా ఆస్తులు కూటబెట్టారని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన వ్యాపారా సామ్రాజాన్ని నిర్మించుకున్నారు సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు కోర్టులో 11 ఛార్జిషీట్‌లు దాఖలు అయ్యా. వాటిపై విచారణ సాగుతోంది. ఆయన ఈ కేసుల విచారణకు 2020జనవరి 10 హాజరయ్యారు. తర్వాత తాను ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరైతే ప్రజా ధనం వృథా అవుతుందని చెప్పి మినహాయింపు పొందారు. 

ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు వీక్లీ పిటిషన్లు వేసి అనుమతి  తీసుకున్న జగన్, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా 'బిజీ'గా ఉన్నారని వాదనలు చేస్తూ వచ్చారు. అయితే ఈ నెల 11న యూరప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి గట్టిగానే చెప్పారు. అయినా సరే ఆయన కోర్టుకు రాకుండా వీడియో కాన్ఫరెన్స ద్వారా హాజరవుతానని చెప్పుకొచ్చారు. దీన్ని కోర్టు అంగీకరించలేదు. కచ్చితంగా కోర్టు రావాల్సిందేనంటూ స్పష్టం చేయడంతో ఇప్పుడు రావాల్సి వచ్చింది.  

ప్లేస్ ఏదైనా అదే రప్పా రప్పా

అక్రమాస్తుల కేసులో కోర్టుకు జగన్ హాజరైన వేళ వైసీపీ శ్రేణులు కోర్టు ప్రాంగణంలో హడావుడి చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. 2029లో 88 సీట్ల మేజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే అంటూ హెచ్చరించారు. రప్పా రప్పా ఉంటుందని వార్నింగ్ ఇచ్చే ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ మోహన్ రెడ్డి బేగంపేటలో విమానం దిగినప్పటి నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే వరకు హంగామా చేశారు. జగన్ మోహన్ రెడ్డి కూడా తన కారు నుంచి బయటకు వచ్చి వారందరికీ అభివాదం చేశారు. 

రోడ్లుపై వైసీపీ శ్రేణుల హడావిడితో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బేగంపేట పరిసరాల్లో వాహనాలు నిలిచిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Advertisement

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget