అన్వేషించండి

Visakha Missing Case: విశాఖలో అదృశ్యమైన ఇంటర్ విద్యార్థుల ఆచూకీ లభ్యం - పానీ పూరి అమ్మి బతకాలని ప్లాన్!

Visakha Missing Case: విశాఖలో అదృశ్యమైన శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు సికింద్రాబాద్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

Visakha Missing Case: విశాఖపట్నం జిల్లా గాజువాక శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయిన విషయం తెలిసిందే. గాజువాకలో కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు పవన్, దిలీప్, బాలీలను పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గుర్తించారు. అయితే ఈ ముగ్గురు విద్యార్థులకు చదువుకోవడం ఇష్టం లేక.. కళాశాల నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుసుకున్నారు. 

అసలేం జరిగిందంటే..?

గాజువాకలోని శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతున్న పవన్, దిలీప్, బాలీలకు చదువు అంటే ఇష్టం లేదు. ఇదే విషయం గురించి ముగ్గురూ చర్చించుకున్నారు. ఇంట్లో ఉండి చదువుకోమంటే తల్లిదండ్రులు ఊరుకోరని.. ఇళ్ల నుంచి పారిపోదామని ప్లాన్ వేసుకున్నారు. అయితే హైదరాబాద్ వెళ్లి, పానీ పూరి అమ్ముతూ బతకొచ్చని అనుకున్నారు. ముగ్గురూ కలిపి పారిపోయేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈక్రమంలోనే ఈనెల 24వ తేదీన కుటుంబ సభ్యులకు కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి.. ముగ్గురూ ఓ చోట చేరారు. అక్కడి నుంచి రైలు ప్రయాణం చేసి సికింద్రాబాద్ చేరుకున్నారు. 

రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో.. స్నేహితులు, బంధువులు, కళాశాలకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు. ఎక్కడకూ రాలేదని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల నుంచి దర్యాప్తు చేయగా.. ఎట్టకేలకు పోలీసులు కేసును చేదించారు. ముగ్గురు విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే పిల్లలను సికింద్రాబాద్ నుంచి విశాఖ తీసుకొచ్చే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇదే ఏడాది ఫిబ్రవరిలోనూ ఓ బాలిక అదృశ్యం

హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన మరియా అనే బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.  ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్థానికంగా ఉన్న స్నేహితులు హసీనా, సక్నతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ముగ్గురూ కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నిన్న ఉదయం వెళ్లిన బాలికలు నేటికీ ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు వెతుకులాటలు మొదలు పెట్టారు. ఫోన్లు చేస్తుంటే ముగ్గురి ఫోన్ లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఎలాంటి ఆచూకీ లబించకపోవడంతో ఆందోళన ఎక్కువైంది. రాత్రంతా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన విషయమంతా పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

వర్ధన్నపేటలో కూడా ఇలాంటి ఘటనే..!

ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 8వ తరగతికి చెందిన విద్యార్థి సెల్ ఫోన్ మాట్లాడడాన్ని తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే వారు వార్డెన్ కు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాడు. అనంతరం వార్డెన్ ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం టిఫిన్ చేసే క్రమంలో 8వ తరగతి బాలికలు ఇద్దరు.. 9వ తరగతి చెందిన మరో బాలిక కనిపించలేదు. దీంతో వారి గదిలో ఉండే విద్యార్థులను ఆరా తీయగా.. ఉదయం బయటికి వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. బంధువులు,స్నేహితుల వద్ద వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్డెన్ స్వరూప తెలిపారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
Aminpur demolitions: అమీన్‌పూర్‌లో కూల్చివేతలు పూర్తి - 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలు పూర్తి - 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget