![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేయాలి- ఐపీఎస్ల ప్యాసింగ్ పరేడ్లో అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'నవ భారతం'లో హింస, వామపక్ష తీవ్రవాద ఆలోచనలకు తావులేదని కేంద్ర హోంమంత్రి అన్నారు.
![ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేయాలి- ఐపీఎస్ల ప్యాసింగ్ పరేడ్లో అమిత్ షా Union Home Minister Amit Shah participated in the passing out parade of 74 RR IPS batch at Sardar Vallabhbhai Patel National Police Academy in Hyderabad on Saturday ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేయాలి- ఐపీఎస్ల ప్యాసింగ్ పరేడ్లో అమిత్ షా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/b208498a588df69991c51a43492368d61676090683783215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శనివారం (ఫిబ్రవరి 11) హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 74 ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
స్వాతంత్య్రానంతరం అఖిల భారత సర్వీసులను ప్రారంభించిన సమయంలో దేశ తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ ఫెడరల్ రాజ్యాంగం కింద దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అఖిల భారత సర్వీసులపై ఉందని చెప్పారన్నారు. ఈ వాక్యాలు మీ జీవితాంతం గుర్తు పెట్టుకోవాలన్నారు.
7 దశాబ్దాలుగా అంతర్గత భద్రత రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, ఈ పరిస్థితుల్లో 36 వేల మంది పోలీసులు అమరులయ్యారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై పని చేశామని అమిత్ షా చెప్పారు. దీంతో టెర్రరిస్ట్ ఫండింగ్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేసిందన్నారు.
'నియంత్రిత వామపక్ష తీవ్రవాదం'
అమిత్ షా తన ప్రసంగంలో వామపక్ష తీవ్రవాదాన్ని ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాదాన్ని కూడా ప్రభుత్వం నియంత్రించిందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. పీఎఫ్ఐ అంశాన్ని అమిత్షా ఉదహరించారు. పీఎఫ్ఐని నిషేధించడం ద్వారా ఇలాంటి సంస్థలకు హెచ్చరికక ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
'వామపక్ష భావాలకు స్థానం లేదు'
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'నవ భారతం'లో హింసకు, వామపక్ష తీవ్రవాద భావాలకు తావులేదని అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వామపక్ష తీవ్రవాదాన్ని, ఎలాంటి హింసనైనా సహించే ప్రసక్తి లేదని అలాంటి విధానాన్ని మోదీ ప్రభుత్వం రూపొందించిందన్నారు.
'వామపక్ష తీవ్రవాదం వల్ల మరణాలు తగ్గాయి'
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా 2022లో నక్సల్స్ ఘటనల్లో 100 మంది కంటే తక్కువ మంది పౌరులు, భద్రతా దళాల సిబ్బంది మరణించారని, 2010తో పోలిస్తే 2022 వరకు వామపక్ష తీవ్రవాద ఘటనలు 76 శాతం తగ్గాయని హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)