అన్వేషించండి

శ్రమకు దక్కిన గౌరవం- టీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంపై టిఎస్ ఆర్టీసి, ఎండీ హర్షం

తెలంగాణ ఆర్టీసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఆర్టీసీ ఎండీ, ఛైర్మన్ ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగుల శ్రమకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆర్టీసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంపై టిఎస్ ఆర్టీసి చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్‌ ఎంతో గొప్ప మనస్సని, ఎప్పట్నుంచి బాధల్లో, కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన గొప్ప వరం అందించారని పొగడ్తలతో వర్షం కురింపించారు. ఇన్నాళ్ల ఉద్యోగుల కష్టాలన్నీ ఒకేసారి పోగొట్టారని తెలిపారు బాజిరెడ్డి.

కేబినెట్‌ సమావేశం తరువాత బాజిరెడ్డి మీడియాతో మాట్లడుతూ గత కొంతకాలంగా ఆర్టీసీ కార్మికులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారన్నారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినా సొంత రాష్ట్రంలో సముచిత స్థానం దక్కలేదని అన్నారు. ఏపీలో ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారనే భావన వారిలో ఉండేదని గుర్తు చేశారు. ఇవాళ కేసీఆర్ ముందు రెండు డిమాండ్లను తాను పెట్టానని, ఒకటి.. వెయ్యి కోట్ల నిధి గ్యారెంటీని కల్పిస్తే పీఎఫ్‌ చెల్లించి వారికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మంచిగా దక్కేలా చూడాలని రెండు పీఆర్‌సీ చెల్లించాలని కోరామన్నారు. కానీ ఇవన్నీ తలకిందులు చేస్తూ కేసీఆర్‌ ఏకంగా కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని, ఇది ఎంతో పెద్ద మనస్సుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ ఇచ్చిన వరమని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 43వేల మంది కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారని, మేమంతా ఎప్పటికీ ఆయన చేసిన మేలును మరిచిపోమన్నఆర్టీసి చైర్మెన్ బాజిరెడ్డి ఉద్యోగుల పక్షాన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కార్పొరేషన్లను అమ్ముకుంటూ ఉద్యోగులను నడిబజార్‌లో పడేస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారనడానికి చెప్పడానికి  నిదర్శనమే తాజాగా విలీనం నిర్ణయం అన్నారు. ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో చేర్చుకోవడం చిన్న విషయం కాదని, ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, తాను ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు.

ఉద్యోగులకు కొంత మేలు చేయగలిగామన్నారు బాజిరెడ్డి. కానీ లాభాల బాట పట్టించలేకపోయామని, కొంత నష్టాన్ని నివారించగలిగామని, ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో ఇక ఉద్యోగుల కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరికిందని అన్నారు. ఈ నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర, దేశ ప్రజలు కూడా హర్షిస్తున్నారని అన్నారు బాజిరెడ్డి. ఏపీ ప్రభుత్వం అక్కడ తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో కమిటీ ద్వారా అధ్యయనం చేసి అంతకన్నా మెరుగైన లబ్ది చేకూరేలా ఇక్కడ నిర్ణయాలు అమలు చేస్తామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు పాస్‌ చేసి ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చుతామని, వారి ఉద్యమ స్పూర్తికి కానుకగా దీన్ని అందిస్తామన్నారు చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆర్టీసి ఎండీ సజ్జనార్. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదని, ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు.సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి, ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తూనంటూ ట్విట్ చేసారు సజ్జనార్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?SRH vs PBKS Match Preview IPL 2025 | పరాజయాల పరంపరలో పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసురుతుందా..?Rohit Sharma Panic Delhi Thunderstorm | ముంబై మ్యాచ్ ప్రాక్టీస్ లో సుడిగాలి బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
Love Story: ప్రేమిస్తే సినిమా చూపించాడు ఈ ప్రేమికుడు - కాకపోతే ఇంకా వైల్డ్ గా - వీడియో చూస్తే షాకే !
ప్రేమిస్తే సినిమా చూపించాడు ఈ ప్రేమికుడు - కాకపోతే ఇంకా వైల్డ్ గా - వీడియో చూస్తే షాకే !
Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
Gold Price News: మరో వారంలో 10 గ్రాముల బంగారం ధర 1 లక్షకు చేరుకుంటుందా? నిపుణుల అభిప్రాయం ఏంటీ?
మరో వారంలో 10 గ్రాముల బంగారం ధర 1 లక్షకు చేరుకుంటుందా? నిపుణుల అభిప్రాయం ఏంటీ?
Embed widget