అన్వేషించండి

TSRTC: రోజువారీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ భారీ షాక్, ఆ రేట్లు భారీగా పెంపు

Hyderabad Bus Pases: కొత్త ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) అధికారులు వెల్లడించారు.

TSRTC News: పెట్రోల్, డీజిల్ ధరల (Petrol, Diesel Prices) పెరుగుదల సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే అతి పెద్ద నిత్యావసరం అయిన వంట గ్యాస్ ధర ఏకంగా రూ.50 ఎగబాకిపోయింది. ఇప్పుడు మళ్లీ మరో షాకింగ్ న్యూస్ కలవరానికి గురి చేస్తోంది. డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతూ ఉన్న వేళ టీఎస్ఆర్టీసీ కూడా ఆ నష్టాల్ని భరించలేక ఆ భారాన్ని సామాన్యులపైకే నెట్టింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల బస్‌పాసుల చార్జీలను ఆర్టీసీ పెంచింది. 

ఈ పెరిగిన కొత్త ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) అధికారులు వెల్లడించారు. జనరల్‌ బస్‌ టికెట్‌ (జీబీటీ) పాసులు కూడా భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ బస్సుల పాసు చార్జీ గతంలో రూ.950 ఉండగా.. తాజాగా రూ.1150కి పెంచనున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు పాసు ధర నెలకు రూ.1,070 ఉండగా.. తాజాగా రూ.1,300కు పెంచారు. మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించే వీలున్న పాసులకు పాత ధర రూ.1,185 కాగా, ప్రస్తుతం రూ.1,450కి పెరగనుంది. మెట్రో లగ్జరీ (ఏసీ) రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున ఎగబాకాయి.

వీరికి కూడా బాదుడే..
మరోవైపు, ఎన్‌జీఓ బస్సు పాసులకు సంబంధించి ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.320 నుంచి రూ.400 కు పెంచాలని నిర్ణయించారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి పెరుగుతుంది. మెట్రో డీలక్స్‌ బస్సు పాసు రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌ – ఆర్టీసీ కోంబో టికెట్‌ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెంచుతారు. 

కొద్ది రోజుల క్రితమే ఆర్టీసీ సేఫ్టీ సెస్‌ పేరుతో బస్సు టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్‌ చేయటంతో గరిష్టంగా టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. గతంలో రౌండాఫ్‌ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజాగా బస్‌పాస్‌ చార్జీలను పెంచారు. అసలైన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం సీఎం వద్ద పెండింగులో ఉంది. ఆయన అనుమతిస్తే అవి కూడా పెరగనున్నాయి. అదే జరిగితే సామాన్యులపై మరింత భారం పడనుంది.

కరోనా లాక్‌ డౌన్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని (TSRTC) గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ (VC Sajjanar) తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు ఆఫర్లు, ప్రత్యేక ప్యాకేజీలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. టీఎస్‌ఆర్టీసీ ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget