అన్వేషించండి

సీఎం కేసీఆర్‌తో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ భేటీ- కీలక నిర్ణయం ఉంటుందా?

తెలంగాణ ముఖ్యమంత్రితో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం... దాని తర్వాత పలు పోటీ పరీక్షలు రద్దు చేయడం జరింది. ఇది రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే రేపుతోంది. ప్రతిపక్షాలు విమర్సలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు పరీక్షల రద్దుతో ఉద్యోగార్థులు కూడా తీవ్ర గందరగోళం ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 

భవిష్యత్ చర్యల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక సమావేశం ఏర్పాటు చేసారు. దీనికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డి సహా  పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ అధికారులతోపాటు మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. 

ఈ కీలక భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకన్నారు. ఇప్పటికే గ్రూప్‌ వన్ లాంటి పరీక్ష రాసిన వేల మంది అభ్యర్థులు తర్వాత దశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. ఇందులో లీకేజీతో సంబందం లేకుండా రాత్రిపగలు చదివి మంచి మార్కులు తెచ్చుకొన్ని అర్హత సాధించిన వాళ్లుు  ఉన్నారు. ఇప్పుడు పరీక్ష రద్దుతో వాళ్లు కూడా నష్టపోయారు. ఇలా చాలా మందికి అన్యాయం జరగుతుంది. అలాంటి వారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వనుంది అనేది ఇప్పుడు ముందున్న టాస్క్

దీంతో పాటు ఒకసారి లీకేజీ ఆరోపణలు వచ్చిన తర్వాత భవిష్యత్‌లో ఎలాంటి లీకేజీ బెడద లేకుండా తీసుకునే చర్యలపై కూడా చర్చ నడుస్తోంది. ఇప్పటికే పరీక్ష విధానంపై చాలా అయోమయం ఉంది. ఇలాంటి టైంలో ఒక్కరు చేసిన తప్పునకు లక్షల మంది బలి అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే మరోసారి ఇలాంటివి రీపీట్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానిపై ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది తేలాలి. 

మొత్తానికి ఈ భేటీలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏమైన చర్యలు తీసుకుంటారా లేకుంటే నివేదిక ఇచ్చి సరిపెట్టేస్తారా అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అంశం. 

లీకేజీ ఆరోపణలతో గ్రూప్ వన్ రద్దు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో 80,039 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నియామక సంస్థలు శరవేగంగా పనిచేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు 17,136 ఉద్యోగాల భర్తీకి 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో ఇప్పటికే ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. మార్చి 5న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష జరుగగా, ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో ఆ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ (టీపీబీవో); మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలను కూడా వాయిదా వేసినట్టు ప్రకటించింది. ఏప్రిల్‌ 4 నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ యథావిధిగా షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget