By: ABP Desam | Updated at : 14 Mar 2023 11:20 PM (IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి
- జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో నిర్మాణం చేపట్టవద్దు
- యథాతథ స్థితి కొనసాగించాలని జూబ్లీహిల్స్ సొసైటీకి, చిరంజీవికి హైకోర్టు ఆదేశం
- 595 గజాల స్థలాన్ని చిరంజీవికి అమ్మారన్న పిటిషన్పై హైకోర్టు విచారణ
- కౌంటర్లు దాఖలు చేయాలని చిరంజీవికి, సొసైటీకి హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ ఏప్రిల్ 25కి వాయిదా
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు తీర్పిచ్చింది. ఈ మేరకు నటుడు చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో నిర్మాణం చేపట్టవద్దని చిరంజీవిని, జూబ్లీహిల్స్ సొసైటీని హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంపై యథాతథ స్థితి కొనసాగించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి జూబ్లీహిల్స్ సొసైటీ విక్రయించిందని జె.శ్రీకాంత్బాబు, తదితరులు పిటిషన్ వేశారు. హైకోర్టులో ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీ గతంలోనే స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని చిరంజీవికి విక్రయించారని పిటిషన్ పేర్కొన్నారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలాన్ని కొనుగోలు చేసి అందులో చిరంజీవి నిర్మాణం చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జీహెచ్ఎంసీని ఆదేశించింది హైకోర్టు. పిటిషన్ తదుపరి విచారణ ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన
YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత
హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్
Playground Under flyover: ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్
Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ
Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి