అన్వేషించండి

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: విచారణకు రాని వారికి తెలంగాణ సిట్ భారీ ఝలక్!

సంతోష్‌ను విచారణ చేయొచ్చని, అరెస్ట్‌ విషయంలో కోర్టు పర్మిషన్ మాత్రం తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇప్పుడు బీఎల్‌ సంతో‌షను నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేయడం సంచలనం అయింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) బీఎల్ సంతోష్ తో పాటు కొత్తగా నలుగురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ముందు నుంచి రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన డాక్టర్ జగ్గు స్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్‌లను కూడా నిందితులుగా చేర్చారు. ఈ మేరకు ఏసీబీ కేసుల స్పెషల్ కోర్టులో తాజాగా సిట్ మెమో దాఖలు చేసింది.

వీరు అందరూ విచారణకు రావాలని కొద్ది రోజుల క్రితం సిట్ నోటీసులు జారీ చేసింది. అయినా శ్రీనివాస్ తప్ప మరెవరూ విచారణకు హాజరు కాలేదు. నవంబరు 21, 22 తేదీల్లో శ్రీనివాస్ విచారణకు వచ్చి మూడో రోజు విచారణకు వెళ్లలేదు. హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన మళ్లీ విచారణకు వస్తారని అనుకుంటున్నారు. తమ ఎదుట విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నందుకు గానూ వీరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కేసులో మొదట్నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీఎల్‌ సంతోష్‌ను సిట్‌ టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన సిట్‌ శనివారం లేదా సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేక గడువు కోరతారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు కొంత టైం కావాలని కోరుతూ బీఎల్ సంతోష్‌ సిట్‌ అధికారులకు ఇటీవల లేఖ రాశారు.

సంతోష్‌ను విచారణ చేయొచ్చని, అరెస్ట్‌ విషయంలో కోర్టు పర్మిషన్ మాత్రం తీసుకోవాలని హైకోర్టు ఇప్పటికే చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఎల్‌ సంతో‌షను నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేయడం సంచలనంగా అయింది.

ఎంపీ రఘురామకీ సిట్ నోటీసులు
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీఆర్‌పీసీ 41(ఏ) ప్రకారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. రామచంద్ర భారతి, నందుతో రఘురామకు పరిచయం ఉన్నట్లుగా సిట్‌ ఆధారాలు గుర్తించింది. అలాగే అజ్ఞాతంలో ఉన్న కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మనీలాల్‌, జగ్గు వద్ద పనిచేసే విమల్‌, ప్రశాంత్‌, శరత్‌లకు నోటీసులు పంపారు. వీరితోపాటు జగ్గుస్వామి పని చేస్తున్న అమృత ఆస్పత్రి భద్రతా అధికారి ప్రతాపన్‌కు సిట్‌ సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసింది.

ఇవాళ విచారణకు హాజరయ్యేవారు వీరే

నేడు సిట్ విచారణకు న్యాయవాది ప్రతాప్ గౌడ్, నంద కుమార్ భార్య చిత్రలేఖ హాజరు కానున్నారు. నంద కుమార్ తో, సింహ యాజీ, రామచంద్ర భారతిలతో ఉన్న సంబంధాలపై ప్రతాప్ గౌడ్ ను సిట్ ప్రశ్నించనుంది. నంద కుమార్ కు సంబంధించిన వివరాలపై చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget