అన్వేషించండి

Revanth Reddy on Modi: మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్

Revanth Reddy: ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మధ్య ఫెవికాల్ బంధం ఉన్నా ప్రజల ఆకాంక్షలు ఎందుకు నెరవేర్చడం లేదని రేవంత్ ప్రశ్నించారు.

ప్రధాన మంత్రి మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న వేళ బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో స్వాగతం పలుకుతుండగా, ఆయన పర్యటనను మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మోదీ పర్యటనను ప్రశ్నిస్తూ ఆయనకు పలు ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విటర్, ఫేస్ బుక్‌లో మోదీకి బహిరంగ లేఖ రాశారు. అంతేకాక, రాజకీయ నాయకులకే కాక మోదీ విద్యార్థులకు కూడా భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అందుకే మోదీ హాజరయ్యే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థుల నేపథ్యాలను తనిఖీ చేశారని, మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని అనుమతించడం లేదని గుర్తు చేశారు. 

ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మధ్య ఫెవికాల్ బంధం ఉన్నా ప్రజల ఆకాంక్షలు ఎందుకు నెరవేర్చడం లేదని రేవంత్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయారని విమర్శించారు.

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవినీతిపై విచారణ ఎందుకు చేయించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ కు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నైనీ కోల్ మైన్స్ విషయంలో అవినీతి, క్రిష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆడుతున్న జగన్నాటకం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ సంగతి ఏంటని నిలదీశారు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను ఎందుకు మూసేశారని అన్నారు. రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేస్తానని ఇప్పుడు ఏం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (మే 26) హైదరాబాద్ కు రానున్న వేళ ఆయన పర్యటన విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన హైదరాబాద్‌కు మధ్యాహ్నం 1.25కు చేరుకోవాల్సి ఉండగా, కాస్త ముందుగా 12.50 నిమిషాలకు రానున్నారు. ఓ అరగంట ముందుగానే హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నారు. ముందుగానే హైదరాబాద్ వచ్చి తర్వాత పావుగంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవ్వనున్నారు. ఆ తర్వాత బేగంపేట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోనున్నారు. అయితే, నిన్ననే బండి సంజయ్ మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదంగా చేసిన వేళ ఇప్పుడు బీజేపీ నేతలతో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jr NTR Fires on Photographer | ఫొటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఆగ్రహం | ABP DesamRaptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తిHarish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABPPro Kodandaram Interview | ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఆదివాసీలకు అండగా కోదండరాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Rathnam Movie Review - రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Best Horror Movies on OTT: వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
Embed widget