అన్వేషించండి

Telangana Unemployed Youth Protest : తెలంగాణ నిరుద్యోగుల ఆవేదన; జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం, నిరసనలు!

Telangana Unemployed Youth Protest: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టో హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ చేస్తున్నాయి.

Telangana Unemployed Youth Protest: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఎన్నికల్లో నిరుద్యోగుల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది. దీనిపై నిన్న 'చలో సెక్రటేరియట్' కార్యక్రమానికి కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. రానున్న రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారే అవకాశం లేకపోలేదు.

నిరుద్యోగులకు కాంగ్రెస్ అభయహస్తం హామీలు

శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ 'అభయహస్తం' పేరుతో రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు పలు హామీలు ఇచ్చింది. ఇది ప్రజలందరి ఆకాంక్షలకు సమగ్ర రూపంగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ఇందులో ప్రధానంగా యువతకు సంబంధించి ఆరు ప్రధాన హామీలను పొందుపరిచారు.

నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలు ఇవే

  1. 2 లక్షల ఉద్యోగాల భర్తీ: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అభయహస్తం పేరుతో హామీ ఇచ్చింది.

  2. నిరుద్యోగ భృతి: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా ఉపాధి కలిగే వరకు ప్రతి నెలా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది.

  3. జాబ్ క్యాలెండర్ విడుదల: ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏ సమయంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవుతుందో అందులో పొందుపరుస్తామని ప్రకటించింది. ఆయా ఉద్యోగాలకు నిరుద్యోగులు గందరగోళం లేకుండా సన్నద్ధమయ్యేందుకు రోడ్ మ్యాప్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పేర్కొంది.

  4. మెగా డీఎస్సీ ప్రకటన: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఏర్పడిన తొలి సమావేశంలోనే మెగా డీఎస్సీ ప్రకటన చేస్తామని, 25 వేల పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని కాంగ్రెస్ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది.

  5. యూత్ కమిషన్ ఏర్పాటు: రాష్ట్రంలో విద్యా, ఉపాధి అవకాశాలు పెంచేందుకు యూత్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఈ కమిషన్ ద్వారా యువతకు వడ్డీ లేకుండా పది లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

  6. విద్యా భరోసా కార్డు: విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని, తద్వారా ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తన ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

నిరుద్యోగ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామంటున్న అధికార కాంగ్రెస్

నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సహా, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక్క ఉద్యోగం తగ్గినా తాను బహిరంగ క్షమాపణకు సిద్ధమని ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ప్రకటించారు. నిధుల సమస్య ఉన్నా హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో స్పందిస్తున్న హస్తం నేతలు రాజీవ్ యువవికాసం లాంటి పథకాలు, యువత నైపుణ్యం పెంచడం వంటివి ఇందులో భాగమని వాదిస్తున్నారు. నిరుద్యోగ భృతి అనేది కేవలం డబ్బు రూపంలో చూడవద్దని, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతున్నారు. రాజీవ్ యువ వికాసంలో స్వయం ఉపాధి కోసం మూడు లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. తాము హామీలు నెరవేరుస్తున్నప్పటికీ దీనిపై పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదన.

హామీలను అమలు చేయాలని నిరసనకు దిగిన నిరుద్యోగులు

అయితే నిరుద్యోగ ఐకాసతోపాటు, ఆయా విద్యార్థి సంఘాల అభిప్రాయాలు మరోలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు కావస్తున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు జులై 4, 2025న 'చలో సచివాలయం' కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో నిరుద్యోగ జేఏసీ, DYFI, BRSV, BRSY, PDSU వంటి సంఘాలు పాల్గొన్నాయి. అశోక్ నగర్, బషీర్ బాగ్ వంటి ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కలిసి సచివాలయం వైపు వస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జిల్లాల నుంచి వచ్చే నిరుద్యోగ యువతను అక్కడే అరెస్టు చేశారు. కొద్ది మంది నాయకులను గృహ నిర్బంధం చేశారు. అయితే ఈ క్రమంలో నిరుద్యోగులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతిపక్షాలు వీరి నిరసనలకు మద్దతు ఇస్తూ, అరెస్టులను తీవ్రంగా ఖండించాయి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గరపడుతున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీకి చెందిన వరంగల్ జిల్లా నేత రాకేశ్ చెబుతున్నారు. తాము నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తెద్దామనుకుంటే పోలీసులతో అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంతవరకు ప్రజాస్వామికమని ప్రశ్నిస్తున్నారు. ఈ నిరసనలో పాల్గొన్న పీడీఎస్ యూ విద్యార్థి సంఘం నాయకురాలు, "జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు చేయలేదని, గొప్పగా ఎన్నికల ప్రణాళికలో చెప్పుకున్న నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు అమలు చేయలేదని" ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ హామీలు డ్రామాలో భాగమే

"ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల ముందు డ్రామాలు ఆడిందని, ఇప్పుడు నిరుద్యోగులను, విద్యార్థులను పట్టించుకోవడం లేదని" మరో విద్యార్థి నేత తుంగ బాలు తమ అభిప్రాయాన్ని ఏబీపీ దేశంతో పంచుకున్నారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫోన్ ద్వారా ఏబీపీ దేశంతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. "కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నాం తప్ప, నిరుద్యోగులు కొత్తవి ఏమి అడగడం లేదు కదా" అని అన్నారు. "ఇంకా ఎంత సమయం తీసుకుంటారో అదైనా చెప్పాలి కదా" అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నారని ఆయనకు ఈ విషయం తెలియాలనే విద్యార్థులు 'చలో సచివాలయం' కార్యక్రమానికి శాంతియుతంగా వస్తుంటే అడ్డుకోవడం సరి కాదని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

నిరుద్యోగ జేఏసీ నేత ప్రత్యూష, "మేం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తుంటే తమను బీజేపీ, బీఆర్ఎస్ నాయకులని ప్రభుత్వం బురద జల్లుతుందని" వాపోయారు. చిక్కడపల్లి లైబ్రరీలో చాలా మంది ఐదు రూపాయల భోజనం తింటూ గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారని, ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఏబీపీ దేశం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ వెంటనే ఇస్తామని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రత్యూష మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే భర్తీ చేసిందే తప్ప కొత్త నోటిఫికేషన్లు ఏం ఇవ్వలేదని నిరుద్యోగ జేఏసీ అభిప్రాయపడుతోంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget