అన్వేషించండి

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు!

తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపాలని స్పీకర్ నిర్ణయించారు. ఇది బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య మరో దఫా రాజకీయ యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంది.

Telangana Latest News:కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపాలని స్పీకర్ కార్యాలయం నిర్ణయించింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ పరిణామం బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య మరోదఫా రాజకీయ యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు అవుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తే, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

స్పీకర్‌కు కాలపరిమితి నిర్ణయించిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని, ఈ విషయంలో స్పీకర్ కార్యాలయం జాప్యం చేస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. రాజకీయ ఫిరాయింపు కేసులపై స్పీకర్ జాప్యం చేయడం తగదని, అలా చేస్తే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేసింది.

ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే, అతని అనర్హతపై స్పీకర్ సహేతుకమైన కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని, అది మూడు నెలలకు మించకుండా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై తెలంగాణ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఒకవేళ ఇంకా ఆలస్యం జరిగితే, బీఆర్‌ఎస్ నేరుగా సుప్రీంకోర్టు తలుపులు మరోసారి తట్టే అవకాశం కలుగుతుంది. అప్పుడు నిర్ణయం అత్యున్నత న్యాయస్థానం చేతుల్లోకి వెళుతుంది. ఈ కారణంగానే స్పీకర్ కార్యాలయం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇవాళో రేపో ఈ మేరకు స్పీకర్ నుంచి పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందనున్నాయి.

స్పీకర్ నోటీసుల తర్వాత ఏం జరుగుతుంది?

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు అందిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటీసులను అందుకున్న తర్వాత, ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ ప్రశ్నలకు సమాధానాలు పంపాల్సి ఉంటుంది. పార్టీ మారడానికి గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను ఆధారంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అంటే, తమ పార్టీ చీలిందని, చీలిక వర్గమైన తమకే మెజారిటీ ఉందని, తమ సభ్యత్వం చెల్లుబాటు అవుతుందని వాదించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఈ అంశంపై స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలను ఒక్కొక్కరిగా పిలిచి వినవచ్చు. వారి వాదనల అనంతరం, చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టవచ్చు. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బట్టి త్వరలోనే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరికొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఆకర్షిస్తుందా?

అయితే, ఎమ్మెల్యేల వాదనలను వినేందుకు తగినంత సమయం స్పీకర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ లోగా రాజకీయ పరిణామాలు ఎలాగైనా మారవచ్చు. అంటే, మరికొంతమంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ తన వైపు ఆకర్షించే అవకాశం ఉంది. అదే జరిగితే, అసెంబ్లీలో చీలిక వర్గం మెజారిటీ తమదేనని, బీఆర్‌ఎస్ పార్టీ తమదేనని చీలిక వర్గం చెప్పుకునే అవకాశం ఉంది. సరిగ్గా మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన పార్టీని చీల్చినట్లు బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, బీఆర్‌ఎస్ గతంలో ఇలా చేసినందుకే పలుమార్లు ఆ పార్టీని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. మళ్ళీ అదే పనిని కాంగ్రెస్ చేస్తే నైతికంగా ప్రజల్లో పలుచన అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకుంటే, పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో, పది నియోజకవర్గాల్లో తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.

స్పీకర్ నిర్ణయంతో మారనున్న తెలంగాణ రాజకీయం

స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలపై విచారణ తర్వాత వేటు వేయకపోతే అది కాంగ్రెస్‌కు లాభిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. ఇదే అదునుగా మరికొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లాక్కునే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ సభ్యత్వం రద్దు చేయకుండా మరికొంత కాలం జాప్యం చేసినా కాంగ్రెస్‌కు అది లాభమే. అయితే, ఎక్కువ కాలం నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఉండలేని పరిస్థితి ఉంది. అదే చేస్తే, మళ్ళీ సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

ఇక, బీఆర్‌ఎస్ విషయానికి వస్తే, స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే అది పెద్ద ఎదురుదెబ్బే. తిరిగి న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకునేలోగా పుణ్య కాలం గడిచిపోవచ్చు. మరికొంతమంది ఎమ్మెల్యేలు చేజారిపోవచ్చు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావచ్చు. కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది. పార్టీ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇక, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, అప్పుడు మాత్రం బీఆర్‌ఎస్‌కు నైతిక బలం చేకూరుతుంది. పది నియోజకవర్గాల్లో ఎన్నికల్లో సానుభూతితో పోటీ దిగే అవకాశం ఉంటుంది.

స్పీకర్ పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై తీసుకునే నిర్ణయం కేవలం చట్టపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయాలను మార్చివేసే ప్రక్రియగా చూడాల్సిన అవసరం ఉంది. అధికార, ప్రతిపక్షాల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఓ ప్రక్రియగా దీన్ని చెప్పవచ్చు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget