అన్వేషించండి

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు!

తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపాలని స్పీకర్ నిర్ణయించారు. ఇది బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య మరో దఫా రాజకీయ యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంది.

Telangana Latest News:కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపాలని స్పీకర్ కార్యాలయం నిర్ణయించింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ పరిణామం బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య మరోదఫా రాజకీయ యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు అవుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తే, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

స్పీకర్‌కు కాలపరిమితి నిర్ణయించిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని, ఈ విషయంలో స్పీకర్ కార్యాలయం జాప్యం చేస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. రాజకీయ ఫిరాయింపు కేసులపై స్పీకర్ జాప్యం చేయడం తగదని, అలా చేస్తే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేసింది.

ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే, అతని అనర్హతపై స్పీకర్ సహేతుకమైన కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని, అది మూడు నెలలకు మించకుండా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై తెలంగాణ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఒకవేళ ఇంకా ఆలస్యం జరిగితే, బీఆర్‌ఎస్ నేరుగా సుప్రీంకోర్టు తలుపులు మరోసారి తట్టే అవకాశం కలుగుతుంది. అప్పుడు నిర్ణయం అత్యున్నత న్యాయస్థానం చేతుల్లోకి వెళుతుంది. ఈ కారణంగానే స్పీకర్ కార్యాలయం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇవాళో రేపో ఈ మేరకు స్పీకర్ నుంచి పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందనున్నాయి.

స్పీకర్ నోటీసుల తర్వాత ఏం జరుగుతుంది?

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు అందిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటీసులను అందుకున్న తర్వాత, ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ ప్రశ్నలకు సమాధానాలు పంపాల్సి ఉంటుంది. పార్టీ మారడానికి గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను ఆధారంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అంటే, తమ పార్టీ చీలిందని, చీలిక వర్గమైన తమకే మెజారిటీ ఉందని, తమ సభ్యత్వం చెల్లుబాటు అవుతుందని వాదించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఈ అంశంపై స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలను ఒక్కొక్కరిగా పిలిచి వినవచ్చు. వారి వాదనల అనంతరం, చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టవచ్చు. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బట్టి త్వరలోనే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరికొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఆకర్షిస్తుందా?

అయితే, ఎమ్మెల్యేల వాదనలను వినేందుకు తగినంత సమయం స్పీకర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ లోగా రాజకీయ పరిణామాలు ఎలాగైనా మారవచ్చు. అంటే, మరికొంతమంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ తన వైపు ఆకర్షించే అవకాశం ఉంది. అదే జరిగితే, అసెంబ్లీలో చీలిక వర్గం మెజారిటీ తమదేనని, బీఆర్‌ఎస్ పార్టీ తమదేనని చీలిక వర్గం చెప్పుకునే అవకాశం ఉంది. సరిగ్గా మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన పార్టీని చీల్చినట్లు బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, బీఆర్‌ఎస్ గతంలో ఇలా చేసినందుకే పలుమార్లు ఆ పార్టీని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. మళ్ళీ అదే పనిని కాంగ్రెస్ చేస్తే నైతికంగా ప్రజల్లో పలుచన అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకుంటే, పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో, పది నియోజకవర్గాల్లో తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.

స్పీకర్ నిర్ణయంతో మారనున్న తెలంగాణ రాజకీయం

స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలపై విచారణ తర్వాత వేటు వేయకపోతే అది కాంగ్రెస్‌కు లాభిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. ఇదే అదునుగా మరికొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లాక్కునే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ సభ్యత్వం రద్దు చేయకుండా మరికొంత కాలం జాప్యం చేసినా కాంగ్రెస్‌కు అది లాభమే. అయితే, ఎక్కువ కాలం నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఉండలేని పరిస్థితి ఉంది. అదే చేస్తే, మళ్ళీ సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

ఇక, బీఆర్‌ఎస్ విషయానికి వస్తే, స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే అది పెద్ద ఎదురుదెబ్బే. తిరిగి న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకునేలోగా పుణ్య కాలం గడిచిపోవచ్చు. మరికొంతమంది ఎమ్మెల్యేలు చేజారిపోవచ్చు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావచ్చు. కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది. పార్టీ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇక, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, అప్పుడు మాత్రం బీఆర్‌ఎస్‌కు నైతిక బలం చేకూరుతుంది. పది నియోజకవర్గాల్లో ఎన్నికల్లో సానుభూతితో పోటీ దిగే అవకాశం ఉంటుంది.

స్పీకర్ పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై తీసుకునే నిర్ణయం కేవలం చట్టపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయాలను మార్చివేసే ప్రక్రియగా చూడాల్సిన అవసరం ఉంది. అధికార, ప్రతిపక్షాల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఓ ప్రక్రియగా దీన్ని చెప్పవచ్చు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Telangana డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
TTD News: ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒక్క చార్జ్‌తో వందల కిలోమీటర్ల ప్రయాణం - రూ.15 లక్షల లోపే బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్‌ కార్లు
పెట్రోల్‌ కోసం రూపాయి కూడా ఖర్చు కాదు - రూ.15 లక్షల లోపే బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్లు
Embed widget