అన్వేషించండి

TS High Court: స్కూళ్లు 31 నుంచి తెరుస్తారా? ప్రశ్నించిన హైకోర్టు.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

శుక్రవారం మధ్యాహ్నం కరోనా పరిస్థితులపై విచారణ ఆన్ లైన్ ద్వారా జరిగింది. ఈ విచారణలో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు వేసింది. వివిధ అంశాల్లో స్పష్టత కోరింది. స్కూళ్లకు సెలవులు ఈ నెలాఖరుతో ముగియనున్నందున 31 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందించారు. స్కూళ్ల పున:ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అంతేకాక, బస్తీలు, ఇతర ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతల నిర్వహణలో కరోనా నియంత్రణ చర్యలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. కొద్ది రోజుల్లో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై కూడా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

శుక్రవారం మధ్యాహ్నం కరోనా పరిస్థితులపై విచారణ ఆన్ లైన్ ద్వారా జరిగింది. ఈ విచారణలో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.16 శాతం ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 77 లక్షల ఇళ్లలో ఫీవర్‌ సర్వే చేపట్టామని, బాధితులకు మొత్తం 3.45 లక్షల కరోనా కిట్లు అందజేశామని డీహెచ్ వివరించారు. ఈ కిట్లలో పిల్లల చికిత్సకు సంబంధించిన ఔషధాలు లేవని న్యాయవాదులు ప్రస్తావించగా.. వారి మందులను కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్‌ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 3,944 మందికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,51,099కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,081కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 39,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 2,444 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,07,498కి చేరింది. 

15 ఏళ్లు వచ్చిన వాళ్లు అర్హులే

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2023 జనవరి నాటికి 15 ఏళ్లు నిండిన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. 15- 18 ఏళ్ల మధ్య వయసు వారితో పాటు వీరు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. 2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన వారు కూడా ఈ 15-18 ఏళ్ల కేటగిరీలోకే వస్తారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కేటగిరీకి చెందిన 59 శాతం మంది పిల్లలు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Prithviraj Sukumaran: 'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Embed widget