అన్వేషించండి

Telangana News: వైద్యులకు లైసెన్స్ పునరుద్ధరణ తిప్పలు - గంటలపాటు క్యూలోనే పడిగాపులు

Telangana News: హైదరాబాద్ కోటిలోని కౌన్సిల్ కార్యాలయం ఎదుట  తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి వైద్యులు తమ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవడానికి  పెద్ద ఎత్తున క్యూలు కట్టారు.   

Telangana News: తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్‌ఎంసీ) వైద్యులు తమ లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవడానికి హైదరాబాద్ కోటిలోని కౌన్సిల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. అక్కడి క్యూలైన్లు చూస్తే రేషన్ దుకుణాలే గుర్తుకు వస్తాయి. రేషన్ షాపుల వద్ద జనాలు వేచి చూస్తున్నట్లు పెద్ద ఎత్తున వైద్యులు క్యూలో ఉన్నారు. జులై 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండడంతో వైద్యులంతా తమ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవడానికి వస్తున్నారు. లైన్ లో నిలబడి.. విపరీతమైన కాళ్ల నొప్పులు రావడంతో.. తమ లైసెన్సు పత్రాలను క్యూలో పెట్టి అవి కొట్టుకుపోకుండా పైన బండరాళ్లు పెట్టారు. ఇలా అందరూ తమ పత్రాలను లైన్ లో పెట్టుకొని పక్కకు వెళ్లి కూర్చున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో మారుమూల గ్రామాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులు తమ లైసెన్సుల రెన్యూవల్ కోసం హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు. పునరుద్ధరణ మరియు ధృవీకరణ లేకుండా వైద్యులు తదుపరి సీఎస్ఎంసీ ఎన్నికలలో పాల్గొనలేరు.

టీఎస్ఎంసీ కార్యాలయం వద్ద ఉదయం 7 గంటల నుంచే వైద్యులు క్యూలో నిల్చుంటున్నారు. కాసేపట్లోనే పనైపోతుంది వెళ్లిపోవచ్చు అనుకొని వచ్చిన వైద్యులు చాలాసేపు ఇక్కడే ఉండడంతో వారి ఆస్పత్రుల్లో ఉన్న రోగులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అక్కడున్న వైద్యుల్లో సగానికి పైగా ఎక్కువ సేపు వస్తున్నాం, వస్తున్నాం అంటూ ఫోన్ లో చెప్పడం గమనార్హం. "చాలా మంది రోగులు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. నేను బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇక్కడి క్యూలైన్ లో నిలబడి ఉన్నాను. కానీ నా వంతు వచ్చేసరికి టోకెన్లు అయిపోయాయి. నేను గురువారం మళ్లీ కార్యాలయానికి వచ్చాను." అని సంగారెడ్డికి చెందిన ఈఎన్‌టి స్పెషలిస్ట్ డాక్టర్ పి సురేష్ కుమార్ చెప్పారు. 

టీఎస్‌ఎంసీ కార్యాలయంలో 100 మంది కూర్చునే అవకాశం ఉంది. కానీ ప్రతిరోజూ 400 నుంచి 500 మంది వైద్యులు కార్యాలయానికి తరలి రావడంతో అది అస్తవ్యస్తంగా మారింది."నేను క్యూలో ఉన్నాను. కానీ విపరీతమైన రద్దీ ఉండడంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యాలయం చిన్నగా ఉండడంతో నిలబడడానికి కూడా చాలా కష్టంగా ఉంటోంది. అని నిర్మల్ జిల్లాకు చెందిన డాక్టర్ సాహిల్ షేక్ అన్నారు. అధికారులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు మొగ్గు చూపాలని ఆయన కోరారు.

ప్రతిరోజూ 100 టోకెన్లు మాత్రమే జారీ చేయడంతో ఇప్పటివరకు సుమారు 1,000 మంది వైద్యులు తమ లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకోగలిగారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది వైద్యులు తమ లైసెన్సులను జూలై 20 గడువు కంటే ముందే రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది. ఆన్‌లైన్ సిస్టమ్ సిద్ధంగా లేనప్పటికీ వైద్యులు వారి వివరాలను పునరుద్ధరించుకోవడాని, ధృవీకరించుకోవడానికి మూడు ఎంపికలను అందించినట్లు టీఎస్ఎంసీ అధికారులు తెలిపారు. వాట్సాప్‌తో పాటు, వైద్యులు పోస్ట్ ద్వారా పత్రాలను పంపవచ్చని.. అలాగే వివరాలను తనిఖీ చేయడానికి, నవీకరించడానికి ప్రత్యేక మొబైల్ నంబర్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతీ ఏడాది తమకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రెన్యూవల్స్(రిజిస్ట్రేషన్ ఐదేళ్లు పూర్తయిన తర్వాత) మాత్రమే వచ్చేవని.. కాకపోతే టీఎస్ఎంసీ ఎన్నికలకు ముందు కొన్ని వైదయ సంఘాలు మరికొంత మంది వైద్యులను ముందుకు తేవడంతో వీరి సంఖ్య పెరిగిందని వివరించారు. పునరుద్ధరణకు ఇతర పద్ధతులను ఉపయోగించమని టీఎస్ఎంసీ చైర్మన్ డాక్టర్ V రాజలింగం అధికారులను ఆదేశించారు. అయితే మరికొద్ది రోజుల్లో వైద్యుల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ సిద్ధమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
The Raja Saab Story : అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Embed widget