అన్వేషించండి

Revanth Reddy: దేవుడు గొప్ప డిజైనర్, ప్రకృతి ఉత్తమ గురువు.. మనం మంచి విద్యార్థులమా ? సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Asia Pacific Bio design Innovation Summit 2025 | బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ 2025 సదస్సులో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

AIG Hospitals | హైదరాబాద్‌: ఏ ఆవిష్కరణ అయినా దాని ప్రయోజనం, పనితీరు, రూపం అనే మూడు అంశాలపై ఆధారపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. “దేవుడు గొప్ప డిజైనర్, ప్రకృతి ఉత్తమ గురువు. మనం మంచి విద్యార్థులమా కాదా అన్నదే అసలు ప్రశ్న” అని సీఎం అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ వేదికగా జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ 2025 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణలపై జరుగుతున్న ఈ సదస్సులో మాట్లాడుతూ బయోడిజైన్ ప్రాధాన్యతను వివరించారు. లైఫ్ సైన్సెస్‌లోనూ, వైద్యంలోనూ ప్రకృతి నుంచి నేర్చుకోవడం వల్ల తప్పులు చేయకుండా ముందుకు సాగవచ్చని సూచించారు.

లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా తెలంగాణ

కృత్రిమ మేధస్సు (Artificial intelligence) బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ అని, మానవుల మెదడును ఆధారంగా చేసుకొని కృత్రిమ మేధస్సును సృష్టించారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న “తెలంగాణ రైజింగ్ 2047” ప్రస్థానాన్ని ఆయన ప్రస్తావించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా నిలుస్తుందని, ఈ ప్రయాణంలో మెడ్‌టెక్, వైద్య పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్ రంగాలు అత్యంత ప్రాధాన్యం కలవని సీఎం గుర్తు చేశారు. తయారీ రంగం నుంచి ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని అన్నారు.


Revanth Reddy: దేవుడు గొప్ప డిజైనర్, ప్రకృతి ఉత్తమ గురువు.. మనం మంచి విద్యార్థులమా ? సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పరిశోధన, పరీక్షలు, తయారీకి అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 60కి పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.

మన దేశం కోసం మన మేధస్సు ఉపయోగించాలి

స్థానిక స్టార్టప్‌లు, MSMEలు గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయని తెలంగాణ సీఎం వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం పరిశోధనలు చేస్తున్న డాక్టర్ నాగేశ్వర రెడ్డి, AIG హాస్పిటల్‌ను రేవంత్ రెడ్డి అభినందించారు. ఇంతకాలం మన మేధస్సు ఇతర దేశాల ప్రజల కోసం ఉపయోగించాం. ఇకపై మన ప్రజల మేలు కోసం ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

డేటా గోప్యతను కాపాడుతూ, ప్రజల వైద్య సహాయం కోసం అవసరమైన డేటాను అందజేస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ, కార్పొరేషన్లు, విద్యాసంస్థలు, రీసెర్చ్ సెంటర్లతో అనుసంధానం చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పన్నులు, యుద్ధాలు, వాణిజ్య అడ్డంకులు వంటి అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఈ సమయంలో ఆవిష్కరణలకు తెలంగాణే సరైన వేదిక అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవాళిని మరింత ఆరోగ్యంగా మార్చడానికి మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget