అన్వేషించండి

Telangana CM KCR Press Meet: వరి రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ - రాష్ట్ర ప్రభుత్వం తరఫున వడ్లు కొనుగోలు

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. 24 గంటల గడువు తర్వాత ప్రెస్‌ మీట్‌ పెట్టిన కేసీఆర్‌... మోదీని, బీజేపీ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వరి రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రప్రభుత్వం తరఫున వడ్లు కొనేందుకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచే ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. యాసంగిలో ప్రతి గింజ కొంటామమన్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 

ఏ రైతు కూడా తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దన్నారు కేసీఆర్. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీలో నలుగురు సభ్యులను నియమించారు. ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు కేసీఆర్. 

వరి విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో కూర్చొని ఉందన్నారు కేసీఆర్. ఏడాది పాటు రైతులు ధర్నాలు చేస్తే వారిని తూలనాడి చివరకు ప్రధాని క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారు. వ్యవసాయన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించాలని కేంద్రం ప్రయత్నమన్నారు. రైతులను ఆయా కంపెనీల్లో కూలీలుగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ధాన్యం కొనుగోలు విషయంలో మంత్రి వద్దకు వెళ్తే.. రైతులకు నూకలు తినే అలవాటు చేయాలని చెప్పడం పియూష్‌ గోయల్‌ అహంకారానికి నిదర్శనమన్నారు కేసీఆర్. తెలంగాణ సాధించిన విజయాలు చూస్తూ తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆ మంత్రికి కనీసం బుద్దైనా ఉందా అంటు ధ్వజమెత్తారు.

కేంద్రానికి పాలన చేతక కాక ఇలాంటి వంకలు పెడుతోందన్నారు కేసీఆర్. వేల టన్నుల బాయిల్డ్ రైస్‌ ఎగుమతి చేసి ఇప్పుడు అబద్దాలు చెప్తున్నారన్నారు. యాసంగి పంటలో నూకల శాతం ఎక్కువ ఉంటుందన్నారు. దీన్నే కేంద్రం సమస్యగా చూపిస్తోందన్నారు. ఈ పంటలు తీసుకొని వచ్చే లాస్‌ను కేంద్రం భరించాలన్నారు. దాన్ని భరించలేక ఇప్పుడు కొర్రీలు పెడుతోందన్నారు. 

తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌పై పెంచలేదన్నారు. కానీ కేంద్రం రోజూ పెంచుతోందన్నారు. దీన్ని తగ్గించమంటే రాష్ట్రాలు తగ్గించాలని ఎదురు దాడి చేస్తున్నారన్నారు. బలమైన కేంద్రం బలహీనమై రాష్ట్రాలు అన్న విధానంతో బీజేపీ పాలిస్తోందన్నారు. కేంద్రం పెంచకుండా తగ్గించమండే ఇదెక్కడి నీతి. 

ఇదే మాదిరిగా వరిలోనూ చూపిస్తున్నారు. 30 శాతం నూకల శాతం నష్టాన్ని భరించడం ఇష్టం లేకుండా ఇలా చేస్తున్నారన్నారు కేసీఆర్. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నామని తెలిసి కూడా విమర్శలు చేస్తున్నారు. ఇది మీ బాధ్యత అని తెలిసి కూడా మేం గుర్తు చేస్తున్నామన్నారు. అందుకే గట్టిగా అడుగుతున్నామన్నారు. భారత్‌ ప్రజల ముందు మోదీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. అందుకే దిల్లీలో ధర్నా చేశామన్నారు. 

అదానీకి పన్నెండు వేల కోట్లు మాఫీ చేశారు కానీ రైతులకు రూపాయి ఇవ్వడానికి మాత్రం మోదీ ప్రభుత్వానికి చేతకాదన్నారు కేసీఆర్. బ్యాంకులను మోసం చేసి దేశాలు దాటి వెళ్లిపోతుంటే వాళ్లకు సహాయం చేస్తున్నారని సంచనల ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. త్వరలోనే బయటపెడతామన్నారు కేసీఆర్. 

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశం చాలా రంగాల్లో కుంగిపోయిందన్నారు కేసీఆర్. అన్నింటిని నాశనం చేసి ఏదైనా వస్తే లేనిపోని మత విధ్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందే డ్రామాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో శ్రీరామ నవమి సందర్భంగా రెచ్చగొట్టే పనులు చేశారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో హిజాబ్, హలాల్‌ ఇలా చాలా వాటిని నిషేధించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, మేధావులు కొట్టుకుపోతే కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందన్నారు కేసీఆర్. కచ్చితంగా ఇండియా ప్రజలు గిల్లి పడేస్తుందన్నారు. ఇవాళ అహంకారపూరితంగా మాట్లాడి నడిపిస్తామనుకుంటే నడవదన్నారు. భారత దేశ రైతులకు దిక్కూ దివానా లేకుండా పోయిందన్నారు. కనీస ధర ఇస్తూ ఒక ఐక్య పాలసీ రావాలన్నారు కేసీఆర్. దేశవ్యాప్తంగా మేధావులు, రైతు సంఘాల నేతలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు కేసీఆర్.   

సమైక్య రాష్ట్రంలో పూర్తిగా ధ్వంసమైన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రగతిలోకి తీసుకొచ్చిందన్నారు కేసీఆర్. గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా కార్యక్రమాలు తీసుకున్నామన్నాని తెలిపారు. వ్యవసాయంలో అనేకి ఉద్దీపనలు సమకూర్చామని వివరించారు. అందులో నీళ్లు సంవృద్దిగా ఇచ్చాం. విద్యుత్‌ 24 గంటలపాటు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. 

మిషన్‌ కాకతీయ అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు కేసీఆర్. ఇండియాలో అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్రం చెప్పిందన్నారు.  విద్యుత్‌ విషయంలో కూడా మంచి ఫలితాలు సాధించాం. రాబోయే రోజుల్లో 5600 మెగా వాట్స్‌ 2023లో మనకు అందుబాటులోకి రాబోతోందన్నారు. 

వీటి వల్ల తెలంగాణలో గొప్ప పంటలకు నెలవుగా మారింది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలకు తోడు ప్రకృతి సహకరించి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల వరకు పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. పంటలు కూడా బాగా పండుతున్నాయన్నారు. 

జీవో నెంబర్‌ 111ను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించినట్టు కేబినెట్‌ వివరాలు వెల్లడించిన కేసీఆర్‌ తెలిపారు. దీని వల్ల ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు కేసీఆర్. మే 20 నుంచి జూన్ 5 వరకు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిర్వహించాలని తేల్చారు. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

యూనివర్శిటీల్లో 3వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. దీని కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్‌ బోర్డు పెట్టి ఫిల్ చేయాలని నిర్ణయించారు. అదే టైంలో ఆరు యూనివర్శిటీలకు కేబినెట్‌ ఆమెదించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget