అన్వేషించండి

Bandi Sanjay On Agnipath: తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు బండి సంజయ్. టిఆర్ఎస్, ఎంఐఎం నేతలే విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని తెలంగాణ బీజేపీ ఆరోపించింది. బాసరలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన ఆయన్ని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌... సికింద్రబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. 

తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు బండి సంజయ్. టిఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు. హైదరాబాదులో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయస్థాయి సమావేశాలపై దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు సంజయ్. రైల్వే ఆస్తుల విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు బండి.

సికింద్రాబాద్‌లో ఆర్మీస్టూడెంట్స్ పేరు మీద కొందరు వ్యక్తులు వచ్చి రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం... ప్రయాణికులపై దాడులు చేయడం దారుణమన్నారు బండి సంజయ్. దీనికి ఆర్మీ విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం వాళ్లదేనన్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్‌ విభాగం ఏం చేస్తోందని నిలదీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వం ప్రేరేపించి చేసిన విధ్వంసమేనన్నారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం  స్పందించలేదంటే... ఎవరి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. కచ్చితంగా బుల్డోజర్ ప్రభుత్వం వస్తేనే ఇలాంటి వారి ఆటలకు అడ్డుకట్టపడుతుందన్నారు.
 
యువతకు అన్యాయం చేసే పని మోదీ ప్రభుత్వ చేయదన్నారు బండి సంజయ్. కచ్చితంగా వాళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని దేశ సేవ కోసం అగ్నిపథ్ తీసుకొచ్చారన్నారు. కావాలనే కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని... వాళ్ల ట్రాప్‌లో పడొద్దని యువతకు సూచించారు. 

త్రిపుట్ ఐటీకి వెళ్తున్న బండి సంజయ్‌ను సుమారు అరగంటపాటు కార్‌లోనే ఉంచి పోలీసులు త్రిబుల్ ఐటీ కి వెళ్లొద్దు అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా త్రిపుల్ ఐటీకి వెళ్తానని బండి సంజయ్ తెలపడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను సిల్లి అని తీసేసిన సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయని సీఎం మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని అన్నారు సంజయ్. ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా.. టెర్రరిస్టులా.. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. విద్యార్థులకు భరోసా కల్పించేందుకే తాము వెళ్తే అడ్డుకున్నారన్నారు. బీజేపీని ఆపడం సీఎం తాత తరం కూడా కాదని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
High Tension in Shamshabad: పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
HYDRAA Hyderabad Mega Drive: హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!
హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget