అన్వేషించండి

Bandi Sanjay On Agnipath: తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు బండి సంజయ్. టిఆర్ఎస్, ఎంఐఎం నేతలే విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని తెలంగాణ బీజేపీ ఆరోపించింది. బాసరలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన ఆయన్ని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌... సికింద్రబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. 

తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు బండి సంజయ్. టిఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు. హైదరాబాదులో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయస్థాయి సమావేశాలపై దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు సంజయ్. రైల్వే ఆస్తుల విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు బండి.

సికింద్రాబాద్‌లో ఆర్మీస్టూడెంట్స్ పేరు మీద కొందరు వ్యక్తులు వచ్చి రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం... ప్రయాణికులపై దాడులు చేయడం దారుణమన్నారు బండి సంజయ్. దీనికి ఆర్మీ విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం వాళ్లదేనన్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్‌ విభాగం ఏం చేస్తోందని నిలదీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వం ప్రేరేపించి చేసిన విధ్వంసమేనన్నారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం  స్పందించలేదంటే... ఎవరి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. కచ్చితంగా బుల్డోజర్ ప్రభుత్వం వస్తేనే ఇలాంటి వారి ఆటలకు అడ్డుకట్టపడుతుందన్నారు.
 
యువతకు అన్యాయం చేసే పని మోదీ ప్రభుత్వ చేయదన్నారు బండి సంజయ్. కచ్చితంగా వాళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని దేశ సేవ కోసం అగ్నిపథ్ తీసుకొచ్చారన్నారు. కావాలనే కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని... వాళ్ల ట్రాప్‌లో పడొద్దని యువతకు సూచించారు. 

త్రిపుట్ ఐటీకి వెళ్తున్న బండి సంజయ్‌ను సుమారు అరగంటపాటు కార్‌లోనే ఉంచి పోలీసులు త్రిబుల్ ఐటీ కి వెళ్లొద్దు అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా త్రిపుల్ ఐటీకి వెళ్తానని బండి సంజయ్ తెలపడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను సిల్లి అని తీసేసిన సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయని సీఎం మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని అన్నారు సంజయ్. ట్రిపుల్ ఐటి విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా.. టెర్రరిస్టులా.. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. విద్యార్థులకు భరోసా కల్పించేందుకే తాము వెళ్తే అడ్డుకున్నారన్నారు. బీజేపీని ఆపడం సీఎం తాత తరం కూడా కాదని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget