అన్వేషించండి

Bandi Sanjay Letter To KCR: ఆ పథకాన్ని రూపొందించండి - సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Letter To CM KCR: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని తక్షణమే ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.

Bandi Sanjay Letter To CM KCR:  తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని తక్షణమే ఆదుకోవాలని తన లేఖలో కోరారు. రైతులను ఆదుకోవడంతో పాటు సమగ్ర పంటల బీమా పథకం రూపొందించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఈ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

బండి సంజయ్ లేఖలో పేర్కొన్న విషయాలివే..
అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. యాసంగిలో 73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో వరి 55 లక్షల ఎకరాల్లో, మక్కలు 6.5 లక్షల ఎకరాల్లో, శనగ 3.65 లక్షల ఎకరాల్లో, పల్లి 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కానీ అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి, మామిడి పంటల రైతుల నష్టాలు మరీ అధికంగా ఉన్నాయి. 40 వేల ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నది. మామిడి పంట నిర్వహణలో 65 శాతం వరకు కౌలు రైతులే ఉన్నారు, మిర్చి సాగు చేసిన రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు.

పంట నష్టం తేల్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. మంత్రుల టీమ్ కేవలం వికారాబాద్ జిల్లాలో పర్యటించడం రైతుల పట్ల మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేలియజేస్తుంది. పలు జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకు సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించకపోవడం సిగ్గు చేటు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా పథకాన్ని తెలంగాణకు వర్తింపజేయకపోవడం వల్ల రాష్ట్ర రైతులకు తీరని నష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటల భీమా పథకాన్ని తీసుకువస్తామని చెప్పి 4 ఏళ్లు గడిచినా మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో మీరు ఈ పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేయకపోవడంవల్ల ఏళ్ల తరబడి రైతులు నష్టపోతూనే ఉన్నారు.

గత ఏడాదితో పోల్చితే పంటల దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. పెట్టుబడి వ్యయం పెరగడమే ఇందుకు కారణం. రైతుకు యూరియా సరఫరాలో వైఫల్యం, కౌలు రైతులకు ఆర్థిక భరోసా లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటల విస్తీర్ణం రైతుల స్థితిగతులతో అంచనా వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన రైతులందరికీ యుద్ద ప్రాతిపదికన పరిహారం అందించాలి. మీ హామీల అమలుకు ఇదే ఆఖరి సంవత్సరం. రాబోయే వానాకాలం సీజన్ కు ముందే రైతులకు ఎరువులు, విత్తనాలు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 

విత్తనాల నుంచి రైతుకు పంట చేతికొచ్చి, మార్కెటింగ్ జరిగే వరకు పోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్నారు. కేవలం రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. రైతు బంధు అందక భూమి సేద్యం చేస్తూ చితికిపోతున్న 14 లక్షల మంది కౌలు రౌతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కనుక అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు సమగ్ర పంటల భీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Embed widget