అన్వేషించండి

Telangana Assembly News: రైతు పంటకు రూ.1900, కేసీఆర్ ఫాంహౌజ్ వరికి రూ.4200! విచారణకు సిద్ధమా? సీఎం రేవంత్ సవాల్

Telangana Assembly Sessions: వరి వేస్తే ఉరి అని సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో అన్నారు. కానీ ఫామ్ హౌజ్లో 150 ఎకరాల్లో వరి పండించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Telangana CM Revanth Reddy: హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటు అయిన 2014 వరకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎన్ని కేసులున్నాయి, విద్యార్థుల మీద ఉన్న ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఉద్యమ కేసులు తొలగించినవి ఎన్ని. దీనిపై ఏనాడైనా సమీక్ష చేశారా?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, గత ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ధర్నా చౌక్ ఎత్తేసి నిర్బంధం సాగించారు, కేటీఆర్ ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
తన ప్రసంగంలో రేవంత్ ప్రస్తావించిన మరిన్ని అంశాలివే..

రైతు పంటకు క్వింటాలకు రూ.1900, కేసీఆర్ ఫాంహౌజ్ లో పండితే రూ.4200..
వరి వేస్తే ఉరి అని సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో అన్నారు. కానీ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి పండించారు కేసీఆర్. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర రూ.1900  ఇచ్చారు. అదే ఫాంహౌజ్ లో పండించిన వరికి క్వింటాలుకు రూ.4200 ఇచ్చారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో పండింది ఏమైనా బంగారమా అని సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫాం హౌజ్ లో పండిన వరిని రూ.4200కు అమ్మలేదు అంటే.. విచారణకు సిద్దమా? చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో ఉంటే, గత పాలకులు ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పి బతికేశారని వ్యాఖ్యానించారు.

రైతులకు బేడీలు వేసినందుకు సిగ్గుపడాలి..
తెలంగాణలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారని బీఆర్ఎస్ సభ్యులు గుర్తించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో.. పేదలకు విద్య, వైద్యం అందిస్తాం.  అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తాం, ప్రతి ఒక్కరికి హక్కులు ఇస్తామన్నారు. నేరెళ్ళల్లో ఇసుక దోపిడీలో మీ పాత్రలేదా, కేటీఆర్ నిజంగా సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
దళితులపై అక్రమ కేసులు పెట్టి సంసారానికి పనికి రాకుండా పోలీసులతో కొట్టించారు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినందుకు సిగ్గుపడాలి అంటూ గత ప్రభుత్వంపై అసెంబ్లీ తొలి సమావేశాల్లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘బీఆర్ఎస్ హయాంలో ఫోన్ లో కూడా స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి లేదని కొత్త ఎమ్మెల్యేలు చెప్పారు. రైతు ఆదాయంలో మన రాష్ట్రం 25వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేస్తే పరిస్థితి ఇలా ఎందుకు ఉంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు కావా. రైతు పంటల భీమా పెడితే ఆత్మహత్యలు జరిగేవి కావు. అన్నదాతలు బతకడానికి ప్రభుత్వం సహాయం చేయాలి. కానీ చనిపోతే కాదు’ అని రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

అమరుల కుటుంబాలను ఆదుకోలేదు, కనీసం వారి కుటుంబ సరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కొడుకు కేటీఆర్, అల్లుడుకు మంత్రి పదవి ఇచ్చారు. కుమార్తె కవితను ప్రజలు ఓడిస్తే, ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపు దారులకు సైతం మంత్రి పదవులు ఇచ్చారు. కరోనా మందు బ్లాక్ లో అమ్ముకున్న వారికి రాజ్యసభ సీటు ఇచ్చారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన డిఎస్పీ నళిని తో ఎందుకు మాట్లాడలేదు.. ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యకారులపై ఉన్న కేసులు ఎందుకు ఎత్తివేయ లేదు. ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న మీరు.. తొమ్మిదిన్నర ఎండ్లలో అమరుల కుటుంబాలను ఒక్క రోజైన ప్రగతి భవన్ కు అహ్వానించారా.? అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులను, గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget