అన్వేషించండి

Telangana Assembly News: రైతు పంటకు రూ.1900, కేసీఆర్ ఫాంహౌజ్ వరికి రూ.4200! విచారణకు సిద్ధమా? సీఎం రేవంత్ సవాల్

Telangana Assembly Sessions: వరి వేస్తే ఉరి అని సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో అన్నారు. కానీ ఫామ్ హౌజ్లో 150 ఎకరాల్లో వరి పండించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Telangana CM Revanth Reddy: హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటు అయిన 2014 వరకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎన్ని కేసులున్నాయి, విద్యార్థుల మీద ఉన్న ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఉద్యమ కేసులు తొలగించినవి ఎన్ని. దీనిపై ఏనాడైనా సమీక్ష చేశారా?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, గత ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ధర్నా చౌక్ ఎత్తేసి నిర్బంధం సాగించారు, కేటీఆర్ ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
తన ప్రసంగంలో రేవంత్ ప్రస్తావించిన మరిన్ని అంశాలివే..

రైతు పంటకు క్వింటాలకు రూ.1900, కేసీఆర్ ఫాంహౌజ్ లో పండితే రూ.4200..
వరి వేస్తే ఉరి అని సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో అన్నారు. కానీ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి పండించారు కేసీఆర్. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర రూ.1900  ఇచ్చారు. అదే ఫాంహౌజ్ లో పండించిన వరికి క్వింటాలుకు రూ.4200 ఇచ్చారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో పండింది ఏమైనా బంగారమా అని సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫాం హౌజ్ లో పండిన వరిని రూ.4200కు అమ్మలేదు అంటే.. విచారణకు సిద్దమా? చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో ఉంటే, గత పాలకులు ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పి బతికేశారని వ్యాఖ్యానించారు.

రైతులకు బేడీలు వేసినందుకు సిగ్గుపడాలి..
తెలంగాణలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారని బీఆర్ఎస్ సభ్యులు గుర్తించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో.. పేదలకు విద్య, వైద్యం అందిస్తాం.  అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తాం, ప్రతి ఒక్కరికి హక్కులు ఇస్తామన్నారు. నేరెళ్ళల్లో ఇసుక దోపిడీలో మీ పాత్రలేదా, కేటీఆర్ నిజంగా సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
దళితులపై అక్రమ కేసులు పెట్టి సంసారానికి పనికి రాకుండా పోలీసులతో కొట్టించారు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినందుకు సిగ్గుపడాలి అంటూ గత ప్రభుత్వంపై అసెంబ్లీ తొలి సమావేశాల్లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘బీఆర్ఎస్ హయాంలో ఫోన్ లో కూడా స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి లేదని కొత్త ఎమ్మెల్యేలు చెప్పారు. రైతు ఆదాయంలో మన రాష్ట్రం 25వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేస్తే పరిస్థితి ఇలా ఎందుకు ఉంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు కావా. రైతు పంటల భీమా పెడితే ఆత్మహత్యలు జరిగేవి కావు. అన్నదాతలు బతకడానికి ప్రభుత్వం సహాయం చేయాలి. కానీ చనిపోతే కాదు’ అని రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

అమరుల కుటుంబాలను ఆదుకోలేదు, కనీసం వారి కుటుంబ సరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కొడుకు కేటీఆర్, అల్లుడుకు మంత్రి పదవి ఇచ్చారు. కుమార్తె కవితను ప్రజలు ఓడిస్తే, ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపు దారులకు సైతం మంత్రి పదవులు ఇచ్చారు. కరోనా మందు బ్లాక్ లో అమ్ముకున్న వారికి రాజ్యసభ సీటు ఇచ్చారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన డిఎస్పీ నళిని తో ఎందుకు మాట్లాడలేదు.. ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యకారులపై ఉన్న కేసులు ఎందుకు ఎత్తివేయ లేదు. ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న మీరు.. తొమ్మిదిన్నర ఎండ్లలో అమరుల కుటుంబాలను ఒక్క రోజైన ప్రగతి భవన్ కు అహ్వానించారా.? అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులను, గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Embed widget