అన్వేషించండి

Telangana Assembly News: రైతు పంటకు రూ.1900, కేసీఆర్ ఫాంహౌజ్ వరికి రూ.4200! విచారణకు సిద్ధమా? సీఎం రేవంత్ సవాల్

Telangana Assembly Sessions: వరి వేస్తే ఉరి అని సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో అన్నారు. కానీ ఫామ్ హౌజ్లో 150 ఎకరాల్లో వరి పండించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Telangana CM Revanth Reddy: హైదరాబాద్: ‘తెలంగాణ ఏర్పాటు అయిన 2014 వరకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎన్ని కేసులున్నాయి, విద్యార్థుల మీద ఉన్న ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఉద్యమ కేసులు తొలగించినవి ఎన్ని. దీనిపై ఏనాడైనా సమీక్ష చేశారా?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, గత ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ధర్నా చౌక్ ఎత్తేసి నిర్బంధం సాగించారు, కేటీఆర్ ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
తన ప్రసంగంలో రేవంత్ ప్రస్తావించిన మరిన్ని అంశాలివే..

రైతు పంటకు క్వింటాలకు రూ.1900, కేసీఆర్ ఫాంహౌజ్ లో పండితే రూ.4200..
వరి వేస్తే ఉరి అని సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో అన్నారు. కానీ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి పండించారు కేసీఆర్. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర రూ.1900  ఇచ్చారు. అదే ఫాంహౌజ్ లో పండించిన వరికి క్వింటాలుకు రూ.4200 ఇచ్చారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో పండింది ఏమైనా బంగారమా అని సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫాం హౌజ్ లో పండిన వరిని రూ.4200కు అమ్మలేదు అంటే.. విచారణకు సిద్దమా? చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానంలో ఉంటే, గత పాలకులు ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పి బతికేశారని వ్యాఖ్యానించారు.

రైతులకు బేడీలు వేసినందుకు సిగ్గుపడాలి..
తెలంగాణలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారని బీఆర్ఎస్ సభ్యులు గుర్తించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో.. పేదలకు విద్య, వైద్యం అందిస్తాం.  అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తాం, ప్రతి ఒక్కరికి హక్కులు ఇస్తామన్నారు. నేరెళ్ళల్లో ఇసుక దోపిడీలో మీ పాత్రలేదా, కేటీఆర్ నిజంగా సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
దళితులపై అక్రమ కేసులు పెట్టి సంసారానికి పనికి రాకుండా పోలీసులతో కొట్టించారు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినందుకు సిగ్గుపడాలి అంటూ గత ప్రభుత్వంపై అసెంబ్లీ తొలి సమావేశాల్లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘బీఆర్ఎస్ హయాంలో ఫోన్ లో కూడా స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి లేదని కొత్త ఎమ్మెల్యేలు చెప్పారు. రైతు ఆదాయంలో మన రాష్ట్రం 25వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేస్తే పరిస్థితి ఇలా ఎందుకు ఉంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు కావా. రైతు పంటల భీమా పెడితే ఆత్మహత్యలు జరిగేవి కావు. అన్నదాతలు బతకడానికి ప్రభుత్వం సహాయం చేయాలి. కానీ చనిపోతే కాదు’ అని రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

అమరుల కుటుంబాలను ఆదుకోలేదు, కనీసం వారి కుటుంబ సరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కొడుకు కేటీఆర్, అల్లుడుకు మంత్రి పదవి ఇచ్చారు. కుమార్తె కవితను ప్రజలు ఓడిస్తే, ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపు దారులకు సైతం మంత్రి పదవులు ఇచ్చారు. కరోనా మందు బ్లాక్ లో అమ్ముకున్న వారికి రాజ్యసభ సీటు ఇచ్చారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన డిఎస్పీ నళిని తో ఎందుకు మాట్లాడలేదు.. ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యకారులపై ఉన్న కేసులు ఎందుకు ఎత్తివేయ లేదు. ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న మీరు.. తొమ్మిదిన్నర ఎండ్లలో అమరుల కుటుంబాలను ఒక్క రోజైన ప్రగతి భవన్ కు అహ్వానించారా.? అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులను, గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget