![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KCR News: 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ కీలక భేటీ - అదే రోజు మేనిఫెస్టో ప్రకటన
అక్టోబరు 15న తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరమే బీఆర్ఎస్ మేనిఫెస్టోని కూడా ప్రకటించనున్నారు.
![KCR News: 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ కీలక భేటీ - అదే రోజు మేనిఫెస్టో ప్రకటన Telangana assembly elections: CM KCR meets with MLA candidates on Oct 15th, manifesto on same day KCR News: 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ కీలక భేటీ - అదే రోజు మేనిఫెస్టో ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/3ff1444dae3846f02172f8522b5d1a011696854911759234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన వేళ ఇక పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అందరికన్నా ముందు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్, వారితో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అక్టోబరు 15న తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరమే బీఆర్ఎస్ మేనిఫెస్టోని కూడా ప్రకటించనున్నారు. అభ్యర్థులకు బీ ఫారాలను కూడా ఈ సమావేశంలోనే అందజేస్తారు. ఎన్నికల ప్రచారం కూడా అదే రోజు నుంచి మొదలు పెట్టనున్నారు.
అందులో భాగంగా అక్టోబరు 15న సాయంత్రం హుస్నాబాద్లో సభ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా కేసీఆర్ పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలు ఉండనున్నాయి. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే మరో మీటింగ్లో కూడా కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్లో జరిగే బహిరంగ సభకు హాజరై ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
హుస్నాబాద్ సభలో మేనిఫెస్టో ప్రకటన
అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టోను కేసీఆర్ ప్రకటించనున్నారు. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన ఉంటుంది. అక్టోబర్ 15న హైదరాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తెల్లారి అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ గారు పాల్గొంటారు. అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)