అన్వేషించండి

ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జన్మించిన హనుమంతరావు కుటుంబంలో తండ్రి, పినతండ్రి..ఇలా అంతా వైద్య వృత్తిలో ఉన్నవారే కావడంతో తాను వైద్య రంగంలో సేవలందించాలని ఆశక్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టారు.

దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న డాక్టర్ పసుపులేటి హనుమంతరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా వైద్య సేవా రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా తాను చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ ప్రకటించిందని, అయితే ఈ విషయంలో కనీసం తనను సిఎం కేసిఆర్, మంత్రులు ఎవరూ అభినందలు తెలపలేదని, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు అవార్డు గ్రహీత. స్వచ్చంద సేవా సంస్థలను ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.
ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!

సరిగ్గా నలభై ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో యస్వీకార్ సంస్దను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో మానసిక, శారీరక వికలాంగులకు నామమాత్రం ఫీజుతో వైద్యం అందించడంతోపాటు వాళ్లు తిరిగి మానసిక, శారీరక వైకల్యం నుంచి కోలుకునేంత వరకూ తమ వద్దనే ఆలనా పాలనా చూస్తూ సేవలందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో 85లక్షల మంది మానసిక, శారీరక వికలాంగులకు పునర్జన్మ ఇచ్చారు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పసుపులేటి హనుమంతరావు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జన్మించిన హనుమంతరావు కుటుంబంలో తండ్రి, పినతండ్రి..ఇలా అంతా వైద్య వృత్తిలో ఉన్నవారే కావడంతో తాను వైద్య రంగంలో సేవలందించాలని ఆశక్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టడమే కాదు.సమాజంలో మానసిక వికలాంగులైన పిల్లలను చూసి చలించిపోయారు. నలభై ఏళ్ల క్రితం వికలాంగులైన తన పిల్లలను ఇళ్లు దాటకుండా పరువుపోతుందనే ఉద్దేశ్యంతో గదిలోపెట్టి తాళాలు వేసిన ఘటనలు చూసి చలించిపోయిన హనుమంతరావు అలాంటి పీడిత చిన్నారుల కోసం స్వీకార్ అనే స్వచ్చంద సంస్థను స్దాపించారు. అలా మొదలైన స్వీకార్ ప్రయాణం ఈ నలభై ఏళ్ల కాలంలో లక్షల మంది చిన్నారులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. 700 మంది మానసిక వికాలంగులను శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలో నియమించినందుకు కేంద్రం స్వీకార్ సేవలకు గతంలో అనేక అవార్డులు ప్రకటించింది. 500 మంది బధిరులను వివిధ ఉద్యోగాలలో నియమించినందుకు ప్రత్యేక పురస్కారాలతో సత్కరించింది.

సమాజం చిన్నచూపు చూస్తున్న చిన్నారులను అక్కున చేర్చుకుని వారికి వైద్యం అందించడంతోపాటు, విద్య, ఉపాధి, ఉద్యోగం ఇలా వారిని జీవితంలో వారి కాళ్లపైవారు నిలబడేలా తీర్చిదిద్దడంలో స్వీకార్ సేవలు ప్రశంసనీయం. తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో సైతం తమ సేవలను విస్తరించింది స్వీకార్ సంస్థ. అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే సంస్దను స్వీకార్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసి వివిధ విభాగాల్లో సేవలను విస్తృతం చేసింది. కేవలం చిన్న పిల్లలకు మాత్రమే కాదు మద్యం, ధూమపానం ఇలా అనేక చెడు వ్యసనాలకు బానిసలైన పెద్దవాళ్లను సైతం అక్కున చేర్చుకుని వైద్యం అందించి డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దడంతో విశేష కృషి చేసింది. ఇలా నాలుగు దశాబ్దాలుగా స్వీకార్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వీకార్ సంస్ద ఫౌండర్ చైర్మెన్ పుసులేటి హనుమంతరావుకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

ఈ  అవార్డు ప్రకటించిన సందర్భంగా ABP దేశంతో అవార్డు గ్రహీత మాట్లడుతూ ఇప్పటికీ రెండు రోజులైనా పద్మశ్రీ అవార్డు రావడంపై కనీసం తెలంగాణ సిఎం కేసిఆర్,ప్రభుత్వ పెద్దలు ఎవరూ అభినందించలేదని అవేదన వ్యక్తం చేశారు. స్వచ్చంద సంస్థలంటే కేసిఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమాత్రం ఆర్థిక సహాయం లేకున్నా నాలుగు దశాబ్ధాలుగా స్వీకార్ సేవలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. నలభై ఏళ్లుగా తన సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని చూసా ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అయినా కేంద్రం పద్మశ్రీ ప్రకటించడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీరు బాధ కలిగించిందన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా మాట్లడుతూ మానసిక ,శారీరకంగా వికలాంగులైన పిల్లలపై తల్లిదండ్రుల ఆలోచన మారుతోందని, ఈరోజుల్లో వారిని బయటకు తీసుకురావడానికి సైతం తల్లిదండ్రులు వెనుకాడటంలేదని తెలిపారు. అవసరమైన వైద్యం అందించి, మనో ధైర్యం ఇస్తూ విద్య, ఉపాధి శిక్షణలు ఇస్తే మానసిక అంగవైకల్యంతో ఉన్న లక్షల మంది చిన్నారులకు కొత్త జీవితం ప్రసాదించవచ్చని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మారాలని, స్వచ్చంద సేవా సంస్దలను నడపలేని పరిస్దితులున్నా అతి కష్టం మీద సేవలందిస్తున్న నిజాయితీగల సంస్దలను గుర్తించి ఆర్దికంగా చేయూతనివ్వాలని కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget