News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cantonment Board: 33 ఎకరాల భూమి ఇచ్చేందుకు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం - ట్రాపిక్ సమస్యలకు చెక్

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడబోతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 33 ఎకరాల భూమిని ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   

FOLLOW US: 
Share:

Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి, బోయిన్ పల్లి ప్రాంతాల్లో ఇక ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్ హెచ్ 44 ప్యారడైజ్ - సుచిత్ర, ఎస్హెచ్1 జింఖానా గ్రౌండ్ - హకీంపేట్ వరకు రోడ్డు విస్తరణకు 33 ఎకరాల భూమిని ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించినట్లు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వెల్లడించారు.

ఆర్మీ, ప్రైవేటు, బీ2 కలిపి మొత్తం 124 ఎకరాల కేటాయింపు విషయం ఆయా శాఖలు చూస్తాయని సీఈఓ వెల్లడించారు. స్కైవేలు, మెట్రో కారిడార్, రహదారుల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన మొత్తం 157 ఎకరాలు ఇవ్వాలని గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ పరిధిలోని 33 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు బోర్డు సీఈఓ తెలిపారు. 33 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం రూ.329 కోట్లను ఇస్తే కంటోన్మెంట్ పరిధిలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఇచ్చిన భూముల్లో రోడ్డు విస్తరణ ద్వారా బోయిన్ పల్లి, తిరుమలగిరి మార్గాల్లో ట్రాఫిక్ తగ్గనుంది.  

 

Published at : 11 Aug 2023 07:49 PM (IST) Tags: Telangana Government Hyderabad News Telangana News Secunderabad Cantonment Board 33 Acres of Land

ఇవి కూడా చూడండి

Telangana Polling 2023 LIVE Updates: ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్ - నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇదే

Telangana Polling 2023 LIVE Updates: ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్ - నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇదే

Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు

Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు

Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు

Telangana Election: సెలబ్రిటీలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే - మహేశ్‌బాబు, మోహన్‌బాబు ఒకేచోట

Telangana Election: సెలబ్రిటీలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే - మహేశ్‌బాబు, మోహన్‌బాబు ఒకేచోట

టాప్ స్టోరీస్

Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు

Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం

Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి