Amrit Bharat Express: తిరుపతి, శబరిమల, తిరువనంతపురం ప్రయాణికులకు గుడ్ న్యూస్! పెర్మనెంట్ అమృత్ భారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ
Amrit Bharat Express: తిరుపతి, శబరిమల, తిరువనంత పురం ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతూ పెర్మనెంట్ అమృత్ భారత్ ట్రైన్ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

Amrit Bharat Express: తెలుగు ప్రజలకు అమృత్ భారత్ 2.0 ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు హైదరాబాద్లోని చర్లపల్లి, కేరళలోని తిరువనంతపురం మధ్య నడుస్తుంది. వీటితోపటు మరో నాలుగు రైళ్లకు కూడా ప్రధాన మంత్రి జెండా ఊపారు.
చర్లపల్లి నుంచి రేణిగుంట మీదుగా తిరువనంతపురం వెళ్లే ట్రైన్ నెంబర్ 17041 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ను రిపబ్లిక్ డే కానుకగా దక్షిణ మధ్య రైల్వే ప్రవేశ పెట్టింది. ఈ మంగళవారం (27.01.2026)న తొలిసారిగా చర్లపల్లి నుంచి బయలుదేరి కేరళలోని తిరువనంతపురం (నార్త్) వెళుతుంది ఈ వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్. ప్రతీ మంగళవారం ఉదయం 7:15కి చర్లపల్లిలో బయలుదేరే ఈ ట్రైన్ బుధవారం మధ్యాహ్నం 2:45కి తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ బుకింగ్స్ ఈరోజు (23.01.26) ఉదయం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే CPRO A. శ్రీధర్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ ట్రైన్ షెడ్యూల్.. స్టాపులు ఇవే
#WATCH | Thiruvananthapuram, Kerala | PM Modi flags off three new Amrit Bharat trains, Nagercoil-Mangaluru, Thiruvananthapuram-Tambaram, Thiruvananthapuram-Charlapalli, and a new passenger train between Thrissur and Guruvayur.
— ANI (@ANI) January 23, 2026
(Video source: DD) pic.twitter.com/cUnLUnArVr
ప్రతీ మంగళవారం ఉదయం 7:15కి చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరే 17041 నెంబర్ గల ఈ ట్రైన్ నల్గొండ 8:37, మిర్యాలగూడ 9:06, సత్తెనపల్లి 10:40, గుంటూరు 11:20, తెనాలి 13:43, బాపట్ల 14:28, ఒంగోలు 15:48 నెల్లూరు 17:23, రేణిగుంట 19:20, తిరుత్తణి 20:08, కాట్పాడి 21:25, జోలర్ పేట్ 22:50, సేలం బుధవారం 00:37, ఈరోడ్ 3:10, తిరుప్పూర్ 3:58, కోయంబత్తూరు 4:57, పాలక్కాడ్ జంక్షన్ 7:25, త్రిసూర్ 9:02 ఆలువా 9:55, ఎర్నాకులం టౌన్ 10:17, కొట్టాయం 11:12, చంగనస్సేరి 11:31, తిరువల్ల 11:41, చెంగన్నూరు 11:52, మావెలికార 12:05, కాయంకుల్లం 12:15, కరుణగపల్లి 12:31, కొల్లాం 12:55,వార్కలా 13:13, తిరువనంతపురం నార్త్ 14:45.
తిరుగు ప్రయాణం లో 17042 నెంబర్ గల అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ప్రతీ బుధవారం సాయంత్రం 5:30కి తిరువనంతపురం నార్త్ స్టేషన్ లో బయలుదేరి గురువారం రాత్రి 11:30కి చర్లపల్లి చేరుకుంటుంది.
#WATCH | Kerala: Preparations are underway as Prime Minister Narendra Modi is to inaugurate the Amrit Bharat Express and lay the foundation stone of various development projects in Thiruvananthapuram. pic.twitter.com/4az5ZbvW3y
— ANI (@ANI) January 23, 2026
ఎన్ని బోగీలు ఉంటాయాంటే
ఈ వీక్లీ ట్రైన్ "అమృత్ భారత్ " కేటగిరీకి చెందినది కావడంతో ఏకంగా 11 జనరల్ క్లాస్, 8 స్లీపర్ క్లాస్, 2 -సెకండ్ క్లాస్ (దివ్యాంగుల కోసం), 1 పాంట్రీ కార్ ఉంటాయి. సెకండ్ క్లాస్ కోచెస్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ ఖర్చుతోనే వేగంగా తమ తమ ప్రాంతాలు చేరుకునే అవకాశం ఈ రైల్లో ఉంటుంది.
మూడు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు మంచి అప్షన్ ఈ ట్రైన్
చర్లపల్లి -తిరువనంత పురం (నార్త్ ) వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ఏకంగా మూడు ప్రసిద్ద పుణ్య క్షేత్రాలకు వెళ్లే తెలుగు భక్తులకు అందుబాటులో ఉండే ట్రైన్. తిరుమల (రేణిగుంట ) శబరిమల (కొల్లాం, చెంగన్నుర్), పద్మనాభస్వామి (తిరువనంత పురం ) క్షేత్రాలకు తక్కువ ఖర్చుతో వెళ్లడానికి భక్తులకు ఈ ట్రైన్ మంచి అప్షన్ అని చెప్పవచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















