అన్వేషించండి

Amrit Bharat Express: తిరుపతి, శబరిమల, తిరువనంతపురం ప్రయాణికులకు గుడ్ న్యూస్! పెర్మనెంట్ అమృత్ భారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ

Amrit Bharat Express: తిరుపతి, శబరిమల, తిరువనంత పురం ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతూ పెర్మనెంట్ అమృత్ భారత్ ట్రైన్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

Amrit Bharat Express: తెలుగు ప్రజలకు అమృత్ భారత్ 2.0 ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు హైదరాబాద్‌లోని చర్లపల్లి, కేరళలోని తిరువనంతపురం మధ్య నడుస్తుంది. వీటితోపటు మరో నాలుగు రైళ్లకు కూడా ప్రధాన మంత్రి జెండా ఊపారు. 

చర్లపల్లి నుంచి రేణిగుంట మీదుగా తిరువనంతపురం వెళ్లే ట్రైన్ నెంబర్ 17041 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌ను రిపబ్లిక్ డే కానుకగా దక్షిణ మధ్య రైల్వే ప్రవేశ పెట్టింది. ఈ మంగళవారం (27.01.2026)న తొలిసారిగా చర్లపల్లి నుంచి బయలుదేరి కేరళలోని తిరువనంతపురం (నార్త్) వెళుతుంది ఈ వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్. ప్రతీ మంగళవారం ఉదయం 7:15కి చర్లపల్లిలో బయలుదేరే ఈ ట్రైన్ బుధవారం మధ్యాహ్నం 2:45కి తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ బుకింగ్స్ ఈరోజు (23.01.26) ఉదయం నుంచి ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే CPRO A. శ్రీధర్ ఒక ప్రకటన లో  తెలిపారు.

ఈ ట్రైన్ షెడ్యూల్.. స్టాపులు ఇవే 

ప్రతీ మంగళవారం ఉదయం 7:15కి చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరే 17041 నెంబర్ గల ఈ ట్రైన్ నల్గొండ 8:37, మిర్యాలగూడ 9:06, సత్తెనపల్లి 10:40, గుంటూరు 11:20, తెనాలి 13:43, బాపట్ల 14:28, ఒంగోలు 15:48 నెల్లూరు 17:23, రేణిగుంట 19:20, తిరుత్తణి 20:08, కాట్పాడి 21:25, జోలర్ పేట్ 22:50, సేలం బుధవారం 00:37, ఈరోడ్ 3:10, తిరుప్పూర్ 3:58, కోయంబత్తూరు 4:57, పాలక్కాడ్ జంక్షన్ 7:25, త్రిసూర్ 9:02 ఆలువా 9:55, ఎర్నాకులం టౌన్ 10:17, కొట్టాయం 11:12, చంగనస్సేరి 11:31, తిరువల్ల 11:41, చెంగన్నూరు 11:52, మావెలికార 12:05, కాయంకుల్లం 12:15, కరుణగపల్లి 12:31, కొల్లాం 12:55,వార్కలా 13:13, తిరువనంతపురం నార్త్  14:45.

తిరుగు ప్రయాణం లో 17042 నెంబర్ గల అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ప్రతీ బుధవారం సాయంత్రం 5:30కి తిరువనంతపురం నార్త్ స్టేషన్ లో బయలుదేరి గురువారం రాత్రి 11:30కి చర్లపల్లి చేరుకుంటుంది.

ఎన్ని బోగీలు ఉంటాయాంటే

ఈ వీక్లీ ట్రైన్ "అమృత్ భారత్ " కేటగిరీకి చెందినది కావడంతో ఏకంగా 11 జనరల్ క్లాస్, 8 స్లీపర్ క్లాస్, 2 -సెకండ్ క్లాస్ (దివ్యాంగుల కోసం), 1 పాంట్రీ కార్ ఉంటాయి. సెకండ్ క్లాస్ కోచెస్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ ఖర్చుతోనే వేగంగా తమ తమ ప్రాంతాలు చేరుకునే అవకాశం ఈ రైల్లో ఉంటుంది.

మూడు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు మంచి అప్షన్ ఈ ట్రైన్ 

చర్లపల్లి -తిరువనంత పురం (నార్త్ ) వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ఏకంగా మూడు ప్రసిద్ద పుణ్య క్షేత్రాలకు వెళ్లే తెలుగు భక్తులకు అందుబాటులో ఉండే ట్రైన్. తిరుమల (రేణిగుంట ) శబరిమల (కొల్లాం, చెంగన్నుర్), పద్మనాభస్వామి (తిరువనంత పురం ) క్షేత్రాలకు తక్కువ ఖర్చుతో వెళ్లడానికి భక్తులకు ఈ ట్రైన్ మంచి అప్షన్ అని చెప్పవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget