అన్వేషించండి

Telangana: గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు, వారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం!

Telangana News | గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఇబ్బంది పడుతున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి గల్ఫ్ కార్మికుల సంక్షేమ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నారు.

Gulf Workers welface committee | హైదరాబాద్: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల ఎమ్మెల్యేలు, నేతలతో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, చనిపోయిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని చర్చించారు. ప్రజావాణిలో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో మొత్తం 5 అంశాలపై చర్చించారు. 

గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గల్ఫ్ కార్మికుల కమిటీలో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ కమిటీలో సభ్యులుగా నియమించాలని.. ఈ మేరకు జీవో విడుదల చేయాలని సూచించారు. 
హైదరాబాద్ ప్రజాభవన్ (Praja Bhavan)లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి (Prajavani)లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి ప్రజావాణి నిర్వహించడంపై చర్చించారు. సమావేశం  అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే (Jyotirao Phule) ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సెప్టెంబర్ 20 నుంచి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని చెప్పారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలో, కళాశాలలో చదవాలని అనుకునే వారికి 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేలా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సైతం రూ. 1 లక్ష ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని NRI సెల్ సూచించింది. తెలంగాణ ఏర్పాటైన జూన్ 2 , 2014 లేదా ఎప్పటినుంచి తీసుకోవాలనే దానిపై కమిటీలు పలు సూచనలు చేశాయి.

గల్ఫ్ లో మృతి చెందిన వేములవాడ నియోజకవర్గానికి చెందిన 2 కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ (Telangana CMRF) నుంచి ఎక్స్ గ్రేషియా ఇచ్చామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరి గల్ఫ్ భీమా ఉండాలని పలువురు ఎమ్మెల్యేలు సైతం సూచించారు. ఇటీవల సింగపూర్, మలేషియాలలోని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పగా.. టీపిసిసి ఎన్ఆర్ఐ కన్వీనర్ ఇమిగ్రేషన్ 1982 యాక్ట్ లో గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) 18 దేశాలు ఉంటాయి. సింగపూర్ లాంటి దేశాలు కూడా గల్ఫ్ కిందకి వస్తాయని కొందరు బదులిచ్చారు.

తెలంగాణ లో 150 ట్రెడ్ లైసెన్స్ మన్ పవర్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. టాంటం, న్యాక్, సెట్వీన్ లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలనీ సూచించారు. ఏజెన్సీల పేరుతో  మోసం జరుగుతుందని, ఇకపై అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటివరకూ గల్ఫ్ కార్మికులు ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఇక్కడికి రప్పించడానికి 7 రోజులకు పైగా పడుతోందని.. కనీసం 48 గంటల్లో డెడ్ బాడీ వచ్చేలా చూడాలని కోరారు. కేరళ రాష్ట్రంలో దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ ఉందని, వారి పాలసీని అధ్యయనం చేయాలని సమావేశంలో చర్చించారు. కేరళలో గల్ఫ్ కార్మికుల ద్వారా జీడీపీకి చాలా వస్తుందని తెలంగాణలో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget