అన్వేషించండి

Ponguleti Srinivas Reddy: బీసీ జనగణన తర్వాతే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీసీ జనగణన తర్వాతే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Panchayat Elections in Telangana | హైదరాబాద్: బీసీ జనగణన అనంతరం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. నాలుగు గోడల మధ్య తాము ఏ నిర్ణయాలు తీసుకోవడం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని తెలంగాణ రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖల మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల మధ్యలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలిస్తుందని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం (బీఆర్ఎస్ ప్రభుత్వం) కేంద్రంతో భేషజాలకు పోవడంతో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నట్లే, తెలంగాణ (Telangana State)కు సైతం న్యాయంగా రావాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని పొంగులేటి తెలిపారు. 

గులాబీ పార్టీ పేకమేడలా కూలిపోతుంది, కారణం ఇదే 
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నామ మాత్రంగా కూడా మిగిలే ప్రసక్తేలేదని, గులాబీ పార్టీ పేకమేడలా కూలిపోతుందని.. వారే కూల్చుకుంటున్నారని మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అధికారం ఇచ్చే పరిపాలన మీద ఫోకస్ చేయాలని కానీ, ప్రతిపక్ష నేతలు, లాయర్లు, జడ్జీలు, సినీ సెలబ్రిటీలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందకు ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలపై ఫోకస్ చేశారంటూ మండిపడ్డారు. వేలకోట్లతో నిర్మించినా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ అన్ని కుట్రల్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామన్నారు. 

చచ్చిన పాము బీఆర్ఎస్‌ను ఇంకా చంపాలని లేదు
బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము అని, ఇంకా చంపాలని తాము అనుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను దిగమింగుకోలేక చెప్పాల్సి వస్తుందన్నారు. ధరణి (Dharani Portal) పేరుతో రైతులు, పేదల భూములు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ధరణి చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అని చెబుతాం, కానీ వారి చెడును కూడా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వేల కోట్ల ప్రజల సొమ్ముని కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. నాలుగు గోడల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని, తమది ప్రజా ప్రభుత్వం కనుక, వారి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ధనిక రాష్ట్రం అని బయటకి గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పులు ఎందుకు చేసిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సాయం అడిగితే నామోషీ అని మిషన్ భగీరథ లాంటి వాటికి గత ప్రభుత్వం (కేసీఆర్) నిధులు అడగలేదని చెప్పారు. తామెంతో చేశామని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లు గొప్పలు చెప్పిన మిషన్ భగీరథ పథకం నీళ్లు రాష్ట్రంలో ఇంకా 30 శాతం మందికి చేరలేదని పేర్కొన్నారు. 

Also Read: Telangana Loan Waiver Funds : రుణ మాఫీ మ్యాజిక్ చేసిన రేవంత్ - రూ. 31 వేల కోట్లు ఎలా సమీకరిస్తున్నారంటే ? 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Embed widget