News
News
వీడియోలు ఆటలు
X

కేసీఆర్‌పై విపక్షాల వార్‌- లీడర్లు లంచాలు తీసుకుంటే చర్యలేవి అంటూ ఫైర్‌

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ప్రతిపక్షాలు

FOLLOW US: 
Share:

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ప్రతిపక్షాలు చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి. వాళ్లంతా లంచాలు తీసుకుంటున్నట్టు సీఎం దగ్గర సాక్ష్యాలు ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి తోకలు కత్తిరిస్తానంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు కథనాలు వస్తున్నాయి. ప్రింట్ మీడియాలో కూడా ఇదే స్టోరీలు రావడంతో వాటిని ట్యాగ్ చేస్తూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 
కేసీఆర్‌ సర్కార్ 30 శాతం కమిషన్ సర్‌కార్‌ అంటూ వంగ్యంగా ట్వీట్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ మీడియాలో వచ్చిన కథనాలను ట్యాగ్ చేశారు. 

షర్మిల ఫైర్

తప్పు చేస్తే నా బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్.. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని ఒప్పుకున్నావు కదా? చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారు.... వాళ్ల చిట్టా ఉందని చెప్తున్నా కేసీఆర్ వాళ్లను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదని నిలదీశారు.  ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసారే... మరి ఆ అనామకుడికున్న విలువ మీకు లేదా అని క్వశ్చన్ చేశారు. మీ దగ్గర చిట్టా ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు కేసీఆర్? అని ట్వీట్ చేశారు. 

ఒక వేళ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే... లిక్కర్ స్కామ్‌లో కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే వెనుకాడుతున్నారని ఎద్దేవా చేశారు షర్మిల. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కళ్లు తుడుచుకొని చూస్తున్నారని ఆరోపించారు. బంగారు బతుకమ్మే బాగా లేనప్పుడు.. ఇతరులను శిక్షించే అర్హత కేసీఆర్‌కు ఎక్కడిదని అభిప్రాయపడ్డారు. 

అసలు కేసీఆర్‌ ప్రభుత్వానికి పాలించే స్థాయి ఎక్కడిది అని ప్రశ్నించారు. అవినీతి పాలనలో మునిగి తేలిన కేసీఆర్‌కు, ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారని అభిప్రాయపడ్డారు. అధికారాన్ని దూరం చేస్తారని హెచ్చరించారు. 

Published at : 28 Apr 2023 12:04 PM (IST) Tags: BJP Bandi Sanjay Hyderabad News BRS KCR Telangana News YSRTP Sharmila

సంబంధిత కథనాలు

Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!

Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

MLC Kavitha on KCR: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప లాభాలు: ఎమ్మెల్సీ కవిత 

MLC Kavitha on KCR: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప లాభాలు: ఎమ్మెల్సీ కవిత 

Drone Show Durgam Cheruvu: దుర్గం చెరువుపై ఆకట్టుకున్న డ్రోన్ షో, దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహణ

Drone Show Durgam Cheruvu: దుర్గం చెరువుపై ఆకట్టుకున్న డ్రోన్ షో, దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహణ

టాప్ స్టోరీస్

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?