అన్వేషించండి

Numaish Last Day: నుమాయిష్‌కు వెళ్లానుకుంటున్నారా? అయితే త్వరపడండి ఇవాళే లాస్ట్

Numaish News: నెలన్నరపాటు భాగ్యనగరవాసులను అలరించిన నుమాయిష్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. దాదాపు 20 లక్షల మందికి పైగా ఈ వస్తుప్రదర్శనను తిలకించినట్లు నిర్వాహకులు వెల్లడించారు

Last Day of Numaish: నెలన్నరపాటు హైదరాబాద్(Hyderabad) వాసులను అలరించిన నుమాయిష్(Numaish) గ్రాండ్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అతిపెద్ద అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన..భాగ్యనగరవాసులను ఎంతో ఆకట్టుంది. సుమారు 20 లక్షల మంది ఈసారి ఎగ్జిబిషన్ సందర్శించినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఎగ్జిబిషన్ కు వెళ్లానుకుంటున్న వారు ఎవరైనా ఉన్నరా అయితే  వెంటనే త్వరపడిండి. నేడే ఆఖరి రోజు..

నుమాయిష్ చివరి రోజు 
భాగ్యనగరవాసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఏడాదిపాటు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన నుమాయిష్(Numaish) ఎగ్జిబిషన్ కు నేడే చివరిరోజు. దాదాపు నెలన్నరపాటు నగరవాసులను అలరించినా...ఇలా వచ్చి అలా వెళ్లిపోయిందే అనిపిస్తోంది. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం(ExhibitionGround)లో ఈ అతిపెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అయితే వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈసారి మూడురోజులు పొడిగించారు. అసలే ఆదివారం, పైగా చివరిరోజు కావడంతో నుమాయిష్ కు జనం పోటెత్తారు. నిన్నటికే ఎగ్జిబిషన్ సందర్శించిన వారి సంఖ్య 20లక్షలు దాటిందని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2400స్టాళ్లతో ఈసారి ఎగ్జిబిషన్ నిర్వహించారు.

ఘనంగా ముగింపు ఉత్సవాలు
నేటితో నుమాయిష్ ముగియనుండటంతో శనివారమే ఘనంగా ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.  నుమాయిష్‌కు సహకరించిన అధికారులు, స్టాల్‌ నిర్వాహకులు, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు గోల్డ్‌ మెడల్‌, ప్రశంసాపత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు. 

ఘన చరిత్ర
నాంపల్లి గ్రౌండ్ లో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలకు ఘనమైన చరిత్రే ఉంది. దాదాపు 8 దశాబ్దాల క్రితమే 1938లో ఏడో నిజాం ఉస్మాన్‌అలీ ఖాన్‌ చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభమైంది. మొదట 100 స్టాళ్లతో 10 రోజులపాటు జరిగిన ఈ ప్రదర్శన శాల 1946 వరకు పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించారు. తరువాత 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. 1946లో హైదరాబాద్‌ అప్పటి ప్రధాని సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ వేదికను నాంపల్లి గ్రౌండ్స్‌కు మార్చారు. స్వాంతత్ర్రం రావడం, హైదరాబాద్(Hyderabad) సంస్థానం విలీన గొడవలు దృష్ట్యా మధ్యలో రెండేళ్లు మినహా 1949లో నుంచి ఏటా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూనే ఉన్నారు.  ప్రస్తుతం ఇది  నెలన్నర రోజులకు పెరిగింది. స్టాళ్ల సంఖ్య సైతం ఏటా పెరుగుతూ 2600 స్టాళ్లకు చేరుకున్నాయి.  

చిన్నలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. నేరుగా వివిధ కంపెనీలే తమ వస్తువులు ప్రదర్శించడానికి ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. దీంతో నాణ్యమైన వస్తువులు ఇక్కడ దొరుకుతాయని ప్రతీతి. ఈ ప్రదర్శన జరిగినన్నాళ్లు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అలాగే మెట్రో రైళ్లకు సైతం అదనపు సమయం కేటాయించారు. హైదరాబాద్ లో నిర్వహించే నుమాయిష్ కు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రదర్శన నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ  సొసైటీకి నగరంలోని పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్డు భవనాల శాఖ, ట్రాఫిల్ పోలీస్ శాఖ మొదలగు శాఖలు సహకరిస్తాయి. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget