అన్వేషించండి

AP Skill Development లో స్కామ్ లేదు, పాడు లేదు, చంద్రబాబు కడిగిన ముత్యంలా వస్తారు: నందమూరి రామకృష్ణ

AP Skill Development News: చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించలేకపోయారు, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదన్నారు నందమూరి రామకృష్ణ.

Nandamuri Ramakrishna supports Chandrababu in AP Skill Development issue:
హైదరాబాద్: అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించలేకపోయారు, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదన్నారు నందమూరి రామకృష్ణ. తమకు కోర్టుల మీద నమ్మకం ఉందని, చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లో పార్టీ శ్రేణులు దీక్ష చేపట్టాయి. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఏపీ అని నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ పాలన మళ్లీ రావాలన్నారు.

హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు చేపట్టిన ఈ దీక్షలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ ది సైకో పాలన అని, ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం అని వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. దోచుకునే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో పాలన చేస్తున్నారని, పేద ప్రజలకు అన్నం ముద్ద పెట్టినోడు జైలుకు వెళ్లారని చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. దగా, మోసం జగన్ పాలన తీరని విమర్శించారు. స్వర్గీయ ఎన్టీఆర్ వేసిన బాటలో నడుస్తూ టీడీపీని, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన నేత చంద్రబాబు అని కొనియాడారు.

పేదలను పట్టించుకుంటూనే ఐటీ రంగాన్ని సైతం అభివృద్ధి చేసిన దార్శనికుడు చంద్రబాబు. స్కామ్ లేదు పాడు లేదు అన్నారు. ఆధారాలు లేకుండానే చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. రిమాండ్ రిపోర్టులో సైతం వాస్తవాలు లేవని చెప్పారు. కోర్టులు సైతం ఆధారాలు అడుగుతున్నా ఏపీ ప్రభుత్వం, సీఐడీ ఏవీ సమర్పించలేకపోయాయన్నారు. రూ.3000 కోట్ల నుంచి ఇప్పుడు రూ.371 కోట్లు అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో స్కామ్ జరిగిందని చెబుతున్నారు. కానీ ఈరోజుకు సైతం ఇందులో అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. అంటే వారు చేస్తున్న ఆరోపణల్లో కూడా పస లేదని చెప్పుకొచ్చారు నందమూరి రామకృష్ణ. మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు. ఆయన కోరుకుంటే టాటా, బిర్లాల కంటే ఎక్కువ స్థాయికి వెళ్లేవారని.. కానీ తెలుగు ప్రజల కోసం జాతీయ పదవులకు వెళ్లని నేత చంద్రబాబు అని పేర్కొన్నారు.

చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు సోమవారం 
 టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు   తీర్పును వెలువరిస్తామని జడ్జి ప్రకటించారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ  సుప్రీంకోర్టులో సోమవారం జరగనుంది.  సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.  కోర్టులో ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. మొత్తంగా మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి.  ఇప్పటికే మూడు రోజుల నుంచి ఏ రోజుకారోజు వాదనలు ముగిసి తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ.. ఇరువురు న్యాయవాదుల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget