అన్వేషించండి

MLC Kavitha: మాకు లేని ప్రాబ్లం, మీకెందుకు- ఆర్టీసీ విలీనం బిల్లుపై ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

MLC Kavitha: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం మేడ్చల్‌లోని కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో మంత్రి మల్లారెడ్డితో కలిసి అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు పుట్టినప్పుడు భూమాత సంతోషిస్తుందని, అలాగే ప్రొఫెసర్ జయశంకర్  పుట్టినప్పుడు కూడా ఆమె సంతోషించి ఉంటుందన్నారు. 

ఆచార్య జయశంకర్‌ తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పారు. జయశంకర్‌ అందరికీ స్ఫూర్తి ప్రధాత అని, అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారని కొనియడారు. ఆచార్య జయశంకర్‌ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవహేళనలు ఎదురైనా ఎక్కడా అధైర్యపడలేదని చెప్పారు.

1948 నుండే  జయశంకర్ పోరాటం చేశారని, వారి స్ఫూర్తి తోనే ఉద్యమం ఊపందుకుందన్నారు. అప్పట్లో అందరూ గులాబీ కండువా కప్పుకున్న వారందరిని చాలా మంది తిట్టారని, ఇప్పుడు అదే నోర్లతో పొగుడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న ప్రభుత్వ పథకాలను చూసి జయశంకర్ ఆత్మ సంతృప్తి చెందుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ అన్నారు.

అదే సమయంలో కేంద్రంపై ఎమ్మెల్సీ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని విమర్శించారు. గుజరాత్‌కు ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతా అంటూ కేంద్రాన్ని నిలదీశారు. నీరు, నిధులు, నియామాకాల కోసం పోరాడి చరిత్రను గుర్తు పెట్టుకోవాలని, ఆ చరిత్రను సీఎం కేసీఆర్ తిరగరాశారని అన్నారు.

రాష్ట్రాన్ని ఎన్నివిధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఉన్నా.. దీనిపై గవర్నర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడంలేదన్నారు. ఇటీవల ఆర్టీసీ బిల్లుకు ఎవరు అడ్డు పడుతున్నారో ప్రజలకు తెలుసునని, గవర్నర్‌ను ఎవరు ఆడిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.  మీకు తెలుసని ఆమె ఎద్దెవా చేశారు. చివరగా బార్ అసోసియేషన్ వారు నూతన‌ భవనం అడిగారని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డికి విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు అమరవీరులకు నివాళులు అర్పించి, అమర వీరులకు జోహార్, జోహర్ ప్రొఫెసర్ జయశంకర్  మంత్రి మల్లారెడ్డి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేడ్చల్‌లో ఉద్యమంలో  అమరడైన శ్రీనివాస్‌కు నివాళులర్పించి అతని భార్య, కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల అందజేశారు. 

ట్విటర్‌లో నివాళి
అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని చెప్పారు. స్వరాష్ట సాధన కోసం నిరంతరం పరితపించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి అని తెలిపారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ‌ మహనీయుడికి ఘన‌ంగా నివాళులర్పిస్తున్నానని అన్నారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget