News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ ఆ తేదీ నుంచే, ప్రకటించిన మంత్రి తలసాని

జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన సోదరులు పంపిణీ చేయనున్నారని తలసాని తెలిపారు.

FOLLOW US: 
Share:

హైదరాబాద్ లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రాచుర్యం పొందిన చేప ప్రసాదాన్ని ఈ నెల 9న ఇవ్వనున్నట్లుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన సోదరులు పంపిణీ చేయనున్నారని తలసాని తెలిపారు. కరోనా వల్ల గత మూడు సంవత్సరాలుగా చేప ప్రసాదాన్ని పంచలేదని చెప్పారు. మళ్లీ ఈ ఏడాది నుంచి చేప మందును పంపిణీ చేస్తామని అన్నారు. బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు. చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది తరలివస్తారని మంత్రి తలసాని అన్నారు.

250 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వాలంటీర్‌లు పని చేస్తున్నారన్నారని మంత్రి తలసాని అన్నారు. చేప ప్రసాదం ఇంటికి తీసుకెళ్లాడానికి కార్తీ కౌంటర్లు కూడా పెంచినట్లు వెల్లడించారు. గోషామహల్ ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి  తలసాని తెలిపారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా గత మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీని ఆపేశారు. అయితే ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీని గురించి కొద్ది రోజుల క్రితమే సచివాలయంలో రాష్ట్ర, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బత్తిని కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీపై మంత్రి తలసానితో మాట్లాడారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని వారు తెలిపారు.

ఈసారి భారీగా జనం వస్తారని అంచనా

చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కీలో మీటర్ల మేర బారులు తీరుతారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడంతో... ఈ సారి జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు. దాదాపు 170 ఏళ్ల నుంచి బత్తిని వంశస్తులు ఆస్తమా పేషెంట్ల కోసం నగరంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో 2020లో తొలిసారి చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా, కొవిడ్19 నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత రెండేళ్లు కూడా ప్రభుత్వం నో చెప్పడంతో ఆస్తమా పేషెంట్లకు నిరాశే ఎదురైంది. 

Published at : 06 Jun 2023 03:25 PM (IST) Tags: Fish Prasadam Talasani Srinivas Minister Talasani Nampalli exhibition groud sthama patients Bathina brothers

ఇవి కూడా చూడండి

Hyderabad News:  వైఎస్‌ సహాయకుడు సూరీడుపై హైదరాబాద్‌లో కేసు - పోలీసులపై కూడా అభియోగాలు

Hyderabad News: వైఎస్‌ సహాయకుడు సూరీడుపై హైదరాబాద్‌లో కేసు - పోలీసులపై కూడా అభియోగాలు

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

Singareni Jobs: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి, ఆ తీర్పు రద్దు

Singareni Jobs: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి, ఆ తీర్పు రద్దు

Breaking News Live Telugu Updates: చంద్రబాబుకు ఎల్లుండి వరకు జ్యుడీషియల్ కస్టడీ: జడ్జి

Breaking News Live Telugu Updates: చంద్రబాబుకు ఎల్లుండి వరకు జ్యుడీషియల్ కస్టడీ: జడ్జి

టాప్ స్టోరీస్

Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్‌

Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్‌

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ