Viral News: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
Jupally Krishna Rao | తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నాడు హైదరాబాద్లో సామాన్యుడిలా సాదాసీదాగా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Minister Jupally In Metro Rail | హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నగరంలో సాదాసీదాగా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా మంత్రులకు ఉండే భారీ భద్రత, కాన్వాయ్ ప్రోటోకాల్స్ను పక్కన పెట్టి, ఆయన ఒక సామాన్య ప్రయాణికుడిలా మెట్రో ఎక్కారు. నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా, ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుని సకాలంలో చేరుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రాఫిక్ కష్టాలు తప్పించుకునేందుకు మెట్రో ఎక్కిన మంత్రి
మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణారావు నేరుగా ఎర్రమంజిల్ స్టేషన్కు చేరుకుని, క్యూలో నిల్చుని టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్లాట్ఫాంపైకి వెళ్లి సామాన్యులతో కలిసి రైలు ఎక్కారు. ఆ సమయంలో రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన ప్రత్యేకంగా సీటు కోసం ప్రయత్నించలేదు. మియాపూర్ వరకు సుమారు 30 నిమిషాల పాటు తోటి ప్రయాణికులతో కలిసే నిల్చుని ప్రయాణించారు. ఈ క్రమంలో ప్రయాణికులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, మెట్రోలోని సౌకర్యాలు, ప్రయాణ అనుభవాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

తమ మధ్యలో మంత్రి జూపల్లి కృష్ణారావును చూసిన ప్రయాణికులు మొదట ఆశ్చర్యానికి గురైనప్పటికీ, ఆయన సాదాసీదా ప్రవర్తనను చూసి హర్షం వ్యక్తం చేశారు. యువత, ఇతర ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, మంత్రి చిరునవ్వుతో వారందరికీ సహకరించారు. పని ఉండటంతో అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయారు. నగరంలో వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, సమయాన్ని ఆదా చేస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో రైలు అత్యుత్తమ మార్గమని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















