అన్వేషించండి

Maoists Latest News: రేణుకను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారు- మావోస్టుపార్టీ సంచలన లేఖ విడుదల

Maoists Latest News: దంతెవాడ-బీజాపూర్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. కామ్రెడ్ రేణుకను ప్లాన్ ప్రకారం హత్య చేశారని ఆరోపించింది.

Maoists Latest News: మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం దూకుడుగా ముందుకెళుతోంది. ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోల ఉనికి ప్రశ్నవార్థకంగా మారే పరిస్దితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే మావోయిస్టుల అంతమే లక్ష్యంగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు పూర్తిగా అబద్ధం అంటూ మావోయిస్టు పార్టీ బహిరంగా లేఖ ద్వారా కేంద్రం తీరును జనం బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. దంతెవాడ, బీజాపూర్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ తాజాగా విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. 

దంతెవాడలో జరిగింది ఎన్ కౌంటర్ కాదు, మర్డర్: మావోయిస్టు పార్టీ
దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో మార్చి 31న జరిగిన ఎన్‌కౌంటర్ అబద్ధం. ముందుగా అరెస్టు చేసిన తర్వాతనే కామ్రేడ్ రేణుకను హత్య చేశారు. కార్పొరేట్ దోపిడిని సులభతరం చేయడానికే ఈ మారణకాండలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఆదివాసీలు, విప్లవకారుల ఊచకోతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దంతెవాడ-బీజాపూర్ జిల్లా సరిహద్దు ఇంద్రావతి నది ఒడ్డున మార్చి 31న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే చనిపోయారని పోలీసులు, అధికారులు విడుదల చేసిన ప్రకటన అవాస్తవమన్నారు.

వాస్తవానికి, కామ్రేడ్ చైతే అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా భైరామ్‌ఘర్ బ్లాక్‌లోని బెల్నార్ గ్రామంలోని ఒక ఇంట్లో ఒంటరిగా ఉందని వివరించారు. ఈ సమాచారాన్ని పోలీసులు తెలుసుకొని మార్చి 31 తెల్లవారుజామున 4 గంటలకు ఆ ఇంటిని చుట్టుముట్టి  చైతేను అరెస్టు చేశారని తెలిపారు. అరెస్టు జరిగిన ప్రదేశంలోనే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు రెండు-మూడు గంటలపాటు విచారించారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఇంద్రావతి నది ఒడ్డుకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు.

హత్య తరువాత ఎన్ కౌంటర్‌గా సృష్టించే ప్రయత్నం చేశారని లేఖలో ధ్వజమెత్తారు. మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్ చైతే మృతి చెందారని , అక్కడ ఒక INSAS రైఫిల్ దొరికినట్లు అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. కామ్రేడ్ రేణుక తప్పుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది నిజమని అభిప్రాయపడ్డారు. 

మావోయిస్టులు రాసిన లేఖలో  ఏముందంటే.." మార్చి 25న సీనియర్‌ కామ్రేడ్‌, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యుడు కొమ్రేడ్‌ లంకేశ్వరపు సారయ్య అలియాస్‌ సుధీర్‌తోపాటు బొడ్గా గ్రామంలో కొంతమంది గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామ్రేడ్ సుధీర్‌ను అదే స్థలంలో పోలీసు అధికారులు విచారించారు. ఉదయం 10 గంటలకు సుధీర్‌తో పాటు ఇద్దరు యువకులను తీసుకెళ్లి హత్య చేశారు. కానీ మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లోరూ. 25 లక్షల రివార్డుతో ఉన్న ఎస్‌జెసి సభ్యుడిని హతమార్చామంటూ పోలీసు అధికారులు తప్పడు ప్రచారం చేశారు. 

నిజానికి కామ్రేడ్ సుధీర్ ఇంద్రావతి ప్రాంతానికి చెందిన జనతన సర్కార్ గురూజీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో స్థానిక కార్మికుల సహకారంతో కొద్దిరోజులుగా అక్కడే ఉండిపోయాడు. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు కామ్రేడ్ సుధీర్‌తో సహా ఈ కాగర్ డామన్ ప్రచారంలో అమరులైన సహచరులందరికీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తోంది. 

విప్లవకారుల త్యాగాలు వృథా కావు. బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్టుల కలలు సాకారం కావు. దేశాన్ని పాలిస్తున్న బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్టులు అణగారిన ప్రజలపై, వారి తరపున పోరాడుతున్న విప్లవకారులపై తీవ్ర అణచివేత, ప్రతి-విప్లవ యుద్ధాన్ని ప్రారంభించారు. దేశంలో విప్లవోద్యమాన్ని తుదముట్టించి, దండకారణ్య అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న అపారమైన సహజ వనరులను దేశ, విదేశీ కార్పోరేట్ కంపెనీలకు విచ్చలవిడిగా ధారాదత్తం చేసి కార్పొరేట్ హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో విప్లవకారులను, గిరిజనులను ఊచకోత కోస్తున్నారు. మృతదేహాలను లెక్కించే ఆట అక్రమంగా, అప్రజాస్వామికంగా, అమానవీయంగా కొనసాగుతోంది. 

అడవుల్లోని గిరిజన గ్రామాల నుంచి మృతదేహాలను ఎంత ఎక్కువగా తీసుకువస్తే అంత గొప్ప విజయం సాధిస్తామన్నారు. ఇదంతా మన దేశంలోని గౌరవనీయులైన నాయకులు, ఉన్నతాధికారులు అని చెప్పుకునేవారే చేస్తున్నారు. లొంగిపోలేకపోతే చంపేస్తాం’ అని బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఏ రాజ్యాంగం, చట్టం ప్రకారం ఇలా చెబుతున్నారు, చేస్తున్నారు? అన్ని ప్రజాస్వామిక, ప్రగతిశీల, లౌకిక, విప్లవాత్మక సామాజిక సంస్థలు, వర్గాలు, వ్యక్తులు ఈ అణచివేతకు వ్యతిరేకంగా తమ గళాన్ని పెంచాలి. ఈ తప్పుడు ఎన్‌కౌంటర్‌తో సహా అన్ని సంఘటనలపై న్యాయ విచారణ కోసం పోరాడాలి. ఘటనా స్థలాన్ని సందర్శించి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా ఈ సంస్థలు, ప్రజల అనుకూల మీడియా సిబ్బందికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకోవాలని, దానిని బట్టబయలు చేయాలని, గిరిజనులు, విప్లవకారులపై జరుగుతున్న మారణహోమ హత్యలను అరికట్టాలని దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అడవులలో తీవ్రమైన అణచివేత కారణంగా, మేము అనేక ముఖ్యమైన అంశాలపై సకాలంలో ప్రతిస్పందన లేదా ప్రకటన ఇవ్వలేకపోతున్నాం" అని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, మావోయిస్టు పార్టీ పేరుతో బహిరంగ లేఖ విడుదల చేశారు.  

కామ్రేడ్ గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతే (55) స్వస్థలం తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామం. తిరుపతి నుంచి మొదటి డివిజన్‌లో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత సాధించారు. దాదాపు 35 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో తన సేవలను అందించిన ఆమె క్లిష్టపరిస్థితుల్లో సైతం ఉద్యమంలో కొనసాగారు. అనారోగ్యంతో బాధపడుతున్నా పార్టీ ఇచ్చిన బాధ్యతలన్నింటినీ చివరి శ్వాస వరకు దృఢ సంకల్పంతో, చొరవతో నిర్వర్తించారు. కామ్రేడ్ రేణుక మొదటి నుంచి ఆమె బలిదానం వరకు తెలంగాణ, దండకారణ్య మహిళా విముక్తి ఉద్యమంలో ముఖ్యమైన, క్రియాశీల పాత్ర పోషించారు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget