అన్వేషించండి

Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి

Telangana Latest News: మార్చినెలలో నమోదైన కేేసులపై ఏసిబి విడుదల చేసిన అధికారిక ప్రకటన సంచలనంగా మారింది.ఏకంగా ఒక్కనెలలోనే 15 మంది అధికారులపై కేసులు నమోదు చేయడం ఆశక్తిగా మారింది.

Telangana Latest News: తెలంగాణలో అవినీతి నిరుధక శాఖ ఇటీవల కాలంలో వరుస దాడులు చేస్తోంది. లంచాల రుచిమరిగిన ప్రభుత్వ ఉద్యోగులను వలపన్ని పట్టుకుంటోంది. ఇలా ఏసీబీ దెబ్బకు గత నెలలో భారీగా అవినీతి చేపలు అధికారులకు చిక్కారు. వివిధ శాఖలకు చెందిన 15 మంది ఉద్యోగులను రెడ్‌హ్యాడెండ్‌గా అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది.  

మార్చి నెలలో భారీగా ఏసీబీ కేసులు నమోదు

మార్చి నెలలో అవినీతి నిరోధక శాఖలో జరిగిన దాడులు, వివరాలను ఏసీబీ వెల్లడించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. లంచాలు అడిగిన వారి సమాచారం ముందుగా బాధితులు ఇవ్వడంతోనే తమ పని సులభతరమైందని అధికారులు చెబుతున్నారు. పక్కా సమాచారం అందిన తర్వతా అలాంటి అధికారులను ట్రాప్ చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు పేర్కొంది.  గత నెలలో ఇలాంటివి తెలంగాణలో 12 కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకోవడమేకాకుండా క్రిమినల్ ప్రవర్తన కలిగిన అధికారులపై 2 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 

చాలా శాఖల్లో లంచావతారుల

తెలంగాణలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో సహా పదిహేను మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ తనిఖీల్లో రెవెన్యూ, హోం, ఎంఏయూడి, ఇంధనం, విద్య, ఆరోగ్యం, వైద్య, రవాణా, వ్యవసాయం, సహకారం వంటి వివిధ విభాగాల్లో అవినీతి అధికారులు చిక్కారని తెలిపారు. వీళ్ల నుంచి రూ.3లక్షల 28వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ 

జనవరి-మార్చి త్రైమాసికంలో 52 కేసులను ఏసిబి నమోదు చేసిందని, 37 ట్రాప్ కేసులు, 4 అక్రమ ఆస్తుల కేసులు, 4 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 3 రెగ్యులర్ ఎంక్వైరీలు, 1 సర్‌ప్రైజ్ చెక్, 3 డిస్‌క్రీట్ ఎంక్వైరీలు చేసినట్లు ప్రకటనలో వివరించారు. ఆరగురు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుతోపాటు, 55 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ట్రాప్ కేసుల్లో రూ. 12 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివిధ విభాగాల డీఏ కేసులో రూ.4 కోట్ల 80 లక్షల పైగా విలువైన ఆస్తులను వెలికి తీసినట్లు పేర్కొన్నారు.

ఇలా ఏసిబి అధికారుల ప్రకటనతో ప్రభుత్వశాఖలో ఏ స్థాయిలో అవినీతి పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. లంచం నేరమని తెలిసినా... లంచగొండి అధికారులపై ఏసిబి డేగకన్ను నిఘా ఉంటుందని తెలిసినా... ఏ మాత్రం జంకులేకుండా బల్లకింద చేతులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవ్వాలంటే, లంచం ఇవ్వాల్సిందేననే వాదనలకు బలం చేకూరేలా ఏసిబి అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ జీతం తీసుకుని విధులు నిర్వహించే అధికారులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా బాధితులకు న్యాయం చేయాలి.కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అలా లేవని స్పష్టంగా అర్దమవుతోంది. శాఖలు ఏవైనా పని జరగాలంటే పైసా ఇవ్వాల్సిందే, కాసులకు కక్కుర్తి పడితేనే కొందరు అధికారులు సమస్య పరిష్కారం కోసం కాలు బయటపెడుతున్నారనే విమర్శలకు తాజాగా ఏసిబి లెక్కలు అద్దం పడుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget