అన్వేషించండి

Nandhikanti Sridhar Quits Congress: మైనంపల్లితో టికెట్ వార్ - కాంగ్రెస్ పార్టీకి నందికంటి శ్రీధర్ రాజీనామా

Nandhikanti Sridhar resigns to congress party: మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు.

Nandhikanti Sridhar resigns to congress party:

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా నేతలు పార్టీలు మారుతున్నారు. టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలతో పాటు తమ శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదంటూ నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అంతకుముందు మౌలాలి క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది పైగా ముఖ్య కార్యకర్తలతో రహస్యభేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని తల్లిలా భావించానని, కానీ ఆ తల్లే నన్ను మోసం చేసిందంటూ నందికంటి శ్రీధర్ కంటతడి పెట్టారని సన్నిహిత వర్గాల సమాచారం.

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడితో పాటు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ తొలి జాబితాలో మైనంపల్లికి టికెట్ వచ్చినా, మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ రాని కారణంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. అయితే పార్టీనే నమ్ముకుని 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఖర్గేకు రాసిన లేఖలో నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి సీటు ఆశించానని, అయితే పొత్తుల కారణంగా సీటు రాలేదని లేఖలో ప్రస్తావించారు.

Nandhikanti Sridhar Quits Congress: మైనంపల్లితో టికెట్ వార్ - కాంగ్రెస్ పార్టీకి నందికంటి శ్రీధర్ రాజీనామా

గత నెల 28న మైనంపల్లి హన్మంతరావు, తన కుమారుడితో పాటు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడికి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. మరోవైపు మెదక్ టికెట్ మైనంపల్లి తనయుడు రోహిత్ కు ఇస్తున్నారని ఇదివరకే మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ టికెట్ తిరుపతి రెడ్డి ఆశించారు. కానీ బీఆర్ఎస్ లో ఆ సీటు తన కుమారుడికి ఇవ్వలేదన్న కారణంగానే మైనంపల్లి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. దాంతో తన ఆశలు గల్లంతు కావడంతో నిరాశ చెందిన తిరుపతి రెడ్డి హస్తం పార్టీని వీడారు. ఈ క్రమంలో మల్కాజిగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. గత ఎన్నికల్లో దక్కని మల్కాజిగిరి టికెట్ ఈసారి వస్తుందని ఆశించిన నందికంటి శ్రీధర్.. మైనంపల్లి హన్మంతరావు పార్టీలో చేరికతో అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ తనకు దక్కడం లేదన్న బాధతో ఆయన సోమవారం పార్టీకి రాజీనామా చేసి లేఖను ఖర్గేకు పంపారు. 

రాజీనామా లేఖలో ఏముందంటే..
‘బీసీ కమ్యూనిటీకి చెందిన తాను (నందికంటి శ్రీధర్) 1994 నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను. ఇతర నేతల్లా కాకుండా పార్టీలు మారకుండా కాంగ్రెస్ కు విధేయుడిగా ఉంటూ, ఎంతో సేవ చేశాను. 2018లో టికెట్ వస్తుందని భావించా. కానీ పొత్తుల కారణంగా టికెట్ రాలేదు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం కుటుంబానికి ఒకే సీటు నిర్ణయాన్ని స్వాగతించి.. ఈ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని భావించాను. కానీ ఇప్పుడు మల్కాజిగిరి మెదక్ టికెట్లను ఒకే కుటుంబానికి కేటాయించారు. ఎన్నో ఏళ్ల నుంచి మల్కాజిగిరికి చెందిన పార్టీ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పోరాడారు. వారిపై అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గలేదు. నేడు అదే నేతను పార్టీలో చేర్చుకుని మాకు అన్యాయం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇద్దరికి టికెట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఓసీ అభ్యర్థికి సీటు ప్రకటించి, బీసీ అభ్యర్థులకు అన్యాయం చేసిన కారణంగా డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని నందికంటి శ్రీధర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget