అన్వేషించండి

Kompella Madhavi Latha: ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన

Hyderabad News: ఒవైసీ పార్లమెంట్‌లో అల్లాహుఅక్బర్ తో పాటు జై పాలస్తీన్ అనడంపై మాధవీ లత తీవ్ర అభ్యంతరం తెలిపారు. అల్లా అన్న నోటితో జై పాలస్తీన్ అనడం ఏంటని.. అతని ఉద్దేశాలు ఏంటని ప్రశ్నించారు.

Owaisi Comments in Parliament: పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కొంపెల్ల మాధవీ లత స్పందించారు. ఒవైసీ పార్లమెంట్‌లో అల్లాహుఅక్బర్ తో పాటు జై పాలస్తీన్ అనడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. అల్లా అన్న నోటితో జై పాలస్తీన్ అనడం ఏంటని.. అతని ఉద్దేశాలు ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్ల దేశ భద్రతకు ముప్పు అని.. తక్షణం ఇతణ్ని విచారణ చేయాల్సి ఉందని ఓ వీడియోను విడుదల చేశారు.

‘‘పార్లమెంటులో జై బోలో భారత్ మాతాకీ అనాల్సిన నోటి నుంచి జై పాలస్తీనా అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటే.. దేశానికే దౌర్భాగ్యం. ఇలాంటివారిని ప్రోత్సహిస్తున్నందుకు 130 కోట్ల మంది భారతీయులు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. రజాకార్ల నుంచి వచ్చి.. వారిని చంపి వారి ఎంఐఎం పార్టీని కైవసం చేసుకొని గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి తెలంగాణలో పాలన చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.. వీరికి మద్దతివ్వడం ఆనవాయితీగా వస్తోంది.

తమ్ముడు చిటికె వేస్తాడు.. 15 నిమిషాల్లో ఖబడ్దార్ ఈ దేశాన్ని శ్మశానం చేస్తా అంటాడు. నేను ఆపాను కాబట్టే అతను ఆగుతున్నాడు.. లేదంటే ఏం చేస్తాడో చూస్కోండి అని అన్న అంటాడు. వీరు ఏం చేస్తారు? జై పాలస్తీన్ అని పార్లమెంట్‌లో అన్నప్పుడు వీరి మనస్తత్వం ఏంటి? ఇలాంటి వారిని మనం పార్లమెంట్‌లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. ప్రశ్నించేవారు లేరా? ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళ్తోంది. 130 కోట్ల జనాభా మధ్యలో ఇలాంటి వారు మనతో ఉండడమే కాకుండా.. అక్రమ మార్గంలో ప్రజాప్రతినిధులై పార్లమెంటులో కూర్చొంటే దానికి రక్షణ ఎక్కడుంది? వీరు హమాస్ వాళ్లా? వారి కోసం పని చేస్తారా? హమాస్ ఆశయాలను భారత దేశంలో అమలు చేయడానికో.. లేదా వారిని సంత్రుప్తి పర్చడం కోసం ఇక్కడ పని చేస్తున్నారా? 

ఏ దేశంలో అయినా పుట్టిన వారు అదే తన మాతృభాష, మాతృభూమిని పాటించి, అదే తన జీవిత లక్ష్యం అని అనుకుంటారు. వీరి ఉద్దేశం అలా లేదు. వీరెప్పుడూ పేరు, ప్రఖ్యాతి, డబ్బు కోసం పరితపించే వికృతమైన వ్యక్తులు వీరు. భగవత్ నామం అల్లా అని పేరు చెప్పి.. జై పాలస్తీన్ అన్నాడంటే.. అతని మనస్సులోంచి వచ్చిన మాటలివి. అతను ఎందుకు ఈ మాటలు అన్నాడు. కచ్చితంగా జాతీయ భద్రతా మండలి వారు ఒవైసీని కూర్చోబెట్టి ప్రశ్నించాలి. అతని మదిలో ఏ ఆలోచనలు ఉన్నాయో తేల్చాలి. ఇప్పుడు కనుక మనం మేల్కోకపోతే, పరిష్కరించుకోకపోతే.. ఈ భారత్ శత్రువులకు పాలు పోసి పెంచినట్లు అవుతుంది’’ అని మాధవీ లత అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget