అన్వేషించండి

Kavitha ED Enquiry: ఎమ్మెల్సీ కవిత ఫోన్లను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు - అడ్వకేట్ భరత్ సమక్షంలోనే!

Kavitha ED Enquiry: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు వాటిని ఈరోజు పరిశీలించబోతున్నారు. అడ్వకేట్ భరత్ ఆధ్వర్యంలో ఫోన్లలో ఉన్న డేటాను సేకరిస్తున్నారు.

Kavitha ED Enquiry: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే ఈడీ అధికారులు పలుమార్లు విచారించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఆమె వాడిన తొమ్మిది ఫోన్లను ఆమె ఈడీ అధికారులకు అప్పగించారు. వారికి అప్పగించే కంటే ముందు కవర్లలో వేసి ఉన్న ఆ ఫోన్లను కవిత మీడియాకు కూడా చూపించారు. అయితే ఈరోజు ఆ ఫోన్లలో ఏముందో తెలుసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత లేదా ఆమె తరఫున ఎవరైన ఈడీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఇందులో భాగంగానే కవిత అడ్వకేట్ సోమ భరత్ రెండో రోజు కూడా ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఇదే కేసు విషయమై మంగళవారం ఈడీ ఆఫీసుకు వెళ్లిన ఈయన.. నేడు రెండోసారి వెళ్లారు. సోమ భరత్ సమక్షంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఫోన్లను చెక్ చేయబోతున్నారు. అందులో ఉన్న డేటాను అధికారులు సేకరిస్తున్నారు. 

ఇటీవలే అంటే మార్చి 21వ తేదీన మూడోసారి ఈడీ విచారణ కోసం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె తన కారులో తండ్రి కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను చూపించారు. రెండు కవర్లలో దాదాపు 10 ఫోన్లను మీడియాకు చూపించారు. ఈ కేసులో ఆధారాలు దొరక్కుండా తన ఫోన్లను కవిత ధ్వంసం చేశారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు వెళ్లే ముందు ఆ ఫోన్లు ప్రత్యేకంగా రెండు కవర్లలో వేసి చూపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ఫోన్లకు స్టిక్కర్లు కూడా అతికించి ఉన్నాయి. ఇంటి నుంచి బయలుదేరే ముందే కాకుండా, ఈడీ కార్యాలయానికి చేరుకున్నాక, లోనికి వెళ్లే ముందు కూడా ఆ ఫోన్లు ఉన్న కవర్లను మరోసారి కవిత పైకి ఎత్తి చూపించారు. 

ఆ తర్వాత ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. తాను ఫోన్లను ధ్వంసం చేశానని ఆరోపణ చేయడాన్ని కవిత  తీవ్రంగా తప్పుపట్టారు. ఈడీ అధికారులు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని, అందుకని తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని అన్నారు. అయినా ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అని కవిత ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ ఈడీ తాను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొందని లేఖలో పేర్కొన్నారు. తనను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసిందని కవిత ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని కవిత వాపోయారు. తద్వారా తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును, తమ పార్టీ ప్రతిష్ఠను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget