అన్వేషించండి

Talasani Srinivas: సికింద్రాబాద్ ప్రమాదం మృతుల కుటుంబాలతో పాటు వారికి ఆర్థిక సాయం: మంత్రి తలసాని

సికింద్రాబాద్ రామ్ గోపాల్‌పేట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని మంత్రి తలసాని తెలిపారు.

సికింద్రాబాద్ రామ్ గోపాల్‌పేట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన భవనం కూల్చే సమయంలో చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఏమైనా నష్టం జరిగితే దానిని భర్తీ చేసే బాధ్యత తమదేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానికులకు హామీ ఇచ్చారు. మినిస్టర్ రోడ్డులో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనాన్ని మంత్రి తలసాని, అధికారులతో కలిసి శనివారం మరోసారి సందర్శించారు. క్రేన్ సహాయంతో కాలిపోయిన భవనం శిథిలాలను పరిశీలించారు. అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని మంత్రి తలసాని తెలిపారు. ఇంకా మంటలు చల్లారకపోవడంతో ఫైర్ అధికారులు ఫోమ్ తో స్ప్రే చేస్తున్నారని వెల్లడించారు. 

ప్రమాదం జరిగిన భవనాన్ని మరోసారి పరిశీలన 
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన భవనాన్ని శనివారం అధికారులతో కలిసి వెళ్లి మంత్రి తలసాని సందర్శించి, శిథిలాలను పరిశీలించారు. భవనం వెనుకాల ఉన్న మరొక్క భవనంపైకి ఎక్కి ప్రమాదం జరిగిన భవనాన్ని మరోసారి పరిశీలించారు. బస్తీవాసిలు మూడు రోజుల నుంచి తాము పడుతున్న అవస్థల గురించి మంత్రి తలసానికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఇది ఊహించని దుర్ఘటన అన్నారు. ఈ ఘటన వలన చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే అన్ని విభాగాల అధికారులు స్పందించి స్థానికులను సురక్షిత స్థలానికి తరలించారని పేర్కొన్నారు. వారికి మూడు పూటలా భోజనాలు కూడా అందించడం వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మెడిసిన్స్ కూడా అందించడం జరుగుతుందని అన్నారు.

జనసంద్రాల మధ్య ఇటువంటి గోదాముల రావడం అగ్నిప్రమాదం జరగడం వలన తీవ్ర నష్టం జరగడం బాధాకరం అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏమి చేయాలనే విషయాలను పరిశీలించి చర్యలు తీసుకునేందుకు ఈ నెల 25న ఒక ఉన్నతస్థాయి కమిటీని వేస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. ఈ కమిటీ జనసంద్రాల మధ్య ఉన్న వాటిని ఏమి చేయాలి రెండోది ఫైర్ సేఫ్టీ లేని వారిని, జిహెచ్ఎంసీ అనుమతులు లేని వారిని ఏమి చేయాలనే విషయాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక ప్రకారం చర్యలు చేపడతాము. దీని వలన కొంతమందికి ఇబ్బందులు కలగవచ్చు కానీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉందని అన్నారు. 

కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేయడం పద్దతి కాదన్నారు. ఘటనపై బాధ్యతా రహితంగా మాట్లాడడం బాధాకరం అన్నారు. భవనాల క్రమబద్దీకరణ పథకం 2008లొనే ఆగిపోయిందన్న విషయం తెలియకుండా భవనాల క్రమబద్దీకరణ ద్వారా జిహెచ్ఎంసీ డబ్బులు దండుకుంటుందని కిషన్ రెడ్డి ఆరోపించడం దురదృష్టకరమ అన్నారు. ప్రజలకు భరోసా కల్పించే విషయాన్ని మరచిపోయి రాజకీయాలు చేయడం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి తలసాని హితవు పలికారు. 

జునైద్ మృతదేహం లభ్యం 
ఈ అగ్ని ప్రమాదం ఘటనలో తొలిరోజు కొందర్ని రక్షించగా.. లోపల చిక్కుకుపోయిన ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను ఇప్పటికే దారుణమైన స్థితిలో వెలికితీశారు. మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం జునైద్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. జునైద్ మృతదేహం వెంట అతడి కుటుంబ సభ్యులు వెళ్లారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget