అన్వేషించండి

COP27 Climate Summit: 16 ఏళ్ల హైదరాబాదీ కుర్రాడికి గ్రేట్ ఛాన్స్, బైడెన్ సహా 200 దేశాధినేతల సభలో మాట్లాడే అవకాశం

16 ఏళ్ల అంకిత్‌కు క్లైమేట్ సైంటిస్ట్ అవ్వాలనేది కల. ‘‘వాతావరణ మార్పు జరుగుతోందని, ఇది చాలా వేగంగా జరుగుతోందని ప్రజలకు తెలియచెప్పడానికి నేను దానిని ఎంచుకున్నాను.’’ అని అంకిత్ తెలిపాడు.

ఈజిప్టులో నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన కాప్ 27 సదస్సులో పాల్గొని మాట్లాడే అరుదైన అవకాశం ఓ భారతీయ విద్యార్థికి, అందులోనూ హైదరాబాద్ టీనేజర్‌కి లభించింది. ఈ కాప్ 27 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఎంతో మంది దేశాధినేతలు హాజరు కానున్నారు. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ దీన్ని నిర్వహిస్తోంది. ఈజిప్ట్ లోని షర్మ ఎల్ షేక్ సిటీలో నవంబరు 6 నుంచి 18వ తేదీ వరకూ సదస్సు జరగనుంది. ఇందులో 200 దేశాలకు చెందిన 35 వేల మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తలు తదితరులు పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా చేసిన తీర్మానాలు, వాటి అమలు తీరును రివ్యూ చేసి, ప్రపంచానికి కొత్త దిశ చూపించనున్నారు.

ఇంతటి ప్రాముఖ్యం ఉన్న సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు చెందిన అంకిత్ సుహాస్ రావు అనే టీనేజర్‌కు అవకాశం దొరికింది. ఇతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నాడు. ఆ స్కూల్‌లో తరచూ నిర్వహించే క్లైమేట్ అవేర్ నెస్ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. ఇప్పటిదాకా తాను నేర్చుకున్నది, పర్యవేక్షించిన సమాచారాన్ని అంకిత్ కాప్ 27 సదస్సులో ప్రెసెంట్ చేయనున్నాడు.

16 ఏళ్ల అంకిత్‌కు క్లైమేట్ సైంటిస్ట్ అవ్వాలనేది కల. ‘‘వాతావరణ మార్పు జరుగుతోందని, ఇది చాలా వేగంగా జరుగుతోందని ప్రజలకు తెలియచెప్పడానికి నేను దానిని ఎంచుకున్నాను.’’ అని అంకిత్ తెలిపాడు. 

గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫెరెన్స్‌లో పాల్గొనే అవకాశం అంకిత్ లాంటి వ్యక్తికి రావడం ఇదేం తొలిసారి కాదు. 2021లో పవన్ త్రిషు కుమార్ అనే విద్యార్థికి స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సదస్సులో అవకాశం దక్కింది. 

ఈ సదస్సు ఎవరు నిర్వహిస్తారు? ఎందుకు?

వాతావరణ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని అరికట్టడానికి, పర్యావరణ మార్పులపై కార్యాచరణ రూపొందించటానికి 'యునైటెన్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆఫ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (యుఎన్‌ఎఫ్‌సీసీసీ)' పేరుతో ఐక్యరాజ్య సమితి ఓ వేదికను ఏర్పాటుచేసింది. ఇందులో భాగస్వామ్యమైన సుమారు 200 దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ (కాప్‌)గా పిలుస్తారు. ఇలా తొట్టతొలి సదస్సు 1995లో బెర్లిన్‌లో జరగ్గా, గత ఏడాది కాప్‌-26 సదస్సు స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో నిర్వహించారు. 

ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు ఎట్టిపరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర పెరగరాదని, అదే జరిగితే సగం మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై కాప్‌లో చర్చించి, ఉష్ణోగ్రతల కట్టడికి ప్రపంచవ్యాప్త కార్యాచరణ రూపొందిస్తారు.

బొగ్గుపై ఆధారపడ్డ పరిశ్రమల విషయంలో వాటిని ఇప్పటికిప్పుడు ఆపేయడం కష్టం. అలాంటి దేశాలకు సంపన్న దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం చేసేలా, ప్రత్యామ్నాయ మార్గాల దిశగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈజిప్టులో జరుగుతున్న సదస్సులో అభివృద్ధి చెందిన దేశాలు చేసే ఆర్థిక సాయంపై తీర్మానాలే కీలకంగా చర్చిస్తారు. గతంలో విచ్చలవిడిగా పర్యావరణాన్ని దెబ్బతీసిన అమెరికా, ఐరోపా వంటి సంపన్న దేశాలు.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేయాలని భారత్‌, బ్రెజిల్‌ తదితర దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget