By: ABP Desam | Updated at : 23 Jan 2023 01:33 PM (IST)
యువకుడిపై దాడి చేస్తున్న దృశ్యాలు
హైదరాబాద్లో ఆదివారం సంచలనం రేపిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాయినాథ్ను స్నేహితులే చంపారని పోలీసులు తేల్చారు. ఆకాష్, టిల్లు, సోనూ హత్య చేసినట్లుగా నిర్ధారించారు. సాయినాథ్ అనే యువకుడిని నిన్న (జనవరి 22) నడి రోడ్డుపై రాడ్లతో కొట్టి, కత్తులతో పొడిచిన సంగతి తెలిసిందే. నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగిందంటే
జనవరి 22న హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ రోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా కత్తితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే యువకుడిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలకు గురైన సదరు యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. ఘటన తర్వాత ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తలోదిక్కుకీ పరారయ్యారు. అయితే, హత్యకు గురైన యువకుడి వివరాలు, హత్యకు గల కారణాలు ఏమీ తెలియరాలేదు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో న్యూ జియాగూడలోని పురాణాపూల్ వెళ్లే రోడ్డుపై ఈ ఘటన జరిగింది.
యువకుడిని ముగ్గురు వ్యక్తులు కత్తులతో వెంబడించారు. యువకుడు పారిపోతూ పడిపోవడంతో ఆ తర్వాత ముగ్గురు విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే, రోడ్డు వెంట వెళ్తున్న వారంతా చూస్తూ ఉన్నారు కానీ, ప్రాణభయంతో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరికొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్
Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!
Vinod Kumar On BJP : తెలంగాణకు రైల్వే లైన్ల మంజూరులో తీరని అన్యాయం, రూ.10 కోట్లు ఏ మూలకు సరిపోతాయ్ - వినోద్ కుమార్
SVS Hospitals BIGITUP : ఎస్వీఎస్ ఆసుపత్రిలో బిగ్గిటప్ సేవలు ప్రారంభం, ఓపీలపై రాయితీ!
Minister Harish Rao: కూకట్ పల్లి అమోర్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
BRS Nanded Meeting : నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !
Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?
IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!
టీడీపీని ఇరుకున పెట్టేందుకు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కొడాలి నాని- ఎన్టీఆర్ మృతిపై విచారణకు డిమాండ్