అన్వేషించండి

Charminar Fire Accident: చార్మినార్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Committee on Charminar Fire Accident | చార్మినార్‌లో మే 18న జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఆరుగురు సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

Hyderabad Fire Accident | హైదరాబాద్: చార్మినార్ లోని గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.  ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 

ఈనెల 18 వ తేదీన చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జారి హౌజ్ వద్ద అగ్ని ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సివి ఆనంద్, తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ,TSSPDCL సిఎండి ముషారఫ్ ఉండనున్నారు. .

గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలతో పాటు ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై విచారణ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి ప్రజలకు సూచనలు ఇవ్వడం, స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతిపాదనలు సూచించాలని కమిటీని ఆదేశించారు. 

ఆదివారం ఉదయం చార్మినార్ పరిధిలోని గుల్జార్ హూస్‌లో ముత్యాల వ్యాపారి నివాసం ఉంటున్న బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎసీ కంప్రెషర్ పేలడంతో మంటలు చెలరేగి కిచెన్ రూంలో ఉన్న సిలిండర్ సైతం పేలడంతో ఊహించని విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో 21 మంది ఉండగా 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు అతికష్టమ్మీద రూఫ్ మీద నుంచి పక్కన ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం ఉదయం దాదాపు 6 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. 6.15కు సమాచారం రాగానే మొగల్ పురా నుంచి ఫైరింజన్ బయలుదేరినట్లు మంత్రులు, అధికారులు తెలిపారు. ఆపై గుల్జార్ హౌస్ వద్దకు 10 ఫైరింజన్లు చేరుకుని అతికష్టమ్మీద మంటలు ఆర్పివేశాయి. ఇంట్లోకి వెళ్లేందుకు వీలుకాక, తలుపులు బద్దలుకొట్టి రెస్క్యూ టీమ్ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి 17 మంది స్పృహతప్పి ఉన్నారు. వారందర్నీ అంబులెన్స్ లలో మలక్‌పేట యశోద, డీఆర్‌డీవో అపోలో హాస్పిల్, ఉస్మానియా హాస్పిటల్స్ కు తరలించారు. వారిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే కొందరు చనిపోయగా, మరికొందరు హాస్పిటల్ చేరిన నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget