By: ABP Desam | Updated at : 19 Jan 2023 12:42 PM (IST)
Edited By: jyothi
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో మాట్లాడుతున్న కేటీఆర్
Euro Fin Group In Hyderabad: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దావోస్ వేదికగా చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారతీయ ఔషధ మార్కెట్ లో విస్తరించేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు ఫ్రాన్స్కు చెందిన యూరోఫిన్స్ సంస్థ అభిప్రాయపడింది. హైదరాబాద్ వేదికగా క్యాంపస్ నెలకొల్పుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్ టెల్ సంస్థ ముందుకు వచ్చింది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికతతోపాటు హైపల్ స్కేల్ డేటా సెంటర్ ను హైదరబాద్ లో ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ తెలిపింది. అనుబంధ సంస్థ అయిన నెక్స్ ట్రా ద్వారా భారతీ ఎయిర్ టెల్ ఈ సెంటర్ ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అవసరం అయిన మౌలిక సదుపాయల కల్పన కోసం రెండు వేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో భారతీ ఎయిర్ టెల్ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్ బుధవారం సమావేశం అయ్యారు.
అనంతరం 60 మెగావాట్ల సామర్థ్యంలో హైపల్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ సెంటర్ రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో పూర్తి స్థాయిలో పని చేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... భారతదేశంలో హైపల్ స్కేల్ డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్ గా మారిందని, ఎయిర్ టెల్ తాజా పెట్టబుడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధ చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్ టెల్-నెక్స్ ట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వివరించారు.
A great boost & major investment for the Telangana Pharmaceutical Sector!
Eurofins, a global leader in Pharma & Bioanalytical Testing, has announced establishment of a fully-equipped, state-of-the-art laboratory campus in Genome Valley, Hyderabad.#WEF23#TelanganaAtDavos pic.twitter.com/MFo5ILZnBy — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 18, 2023
భారతీయ ఔషధ మార్కెట్ లో విస్తరించేందుకు హైదరాబాద్ లో క్యాంపస్ ను నెలకొల్పుతున్నట్లు ఫ్రాన్స్ కు చెందిన యూరోఫిన్స్ సంస్థ తెలిపింది. ఆహారం, పర్యావరణం, ఔషధాలు, కాస్మొటిక్ ఉత్పత్తుల పరీక్షలో ఈ సంస్థ పేరుగాంచింది. ఈ క్రమంలోనే దావోస్ లో బుధవారం రోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో యూరోఫిన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలను హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు యూరోఫిన్స్ ప్రకటించింది.
The Global Valley of Growth - Genome Valley is now home to @EurofinsGroup.
— Telangana Life Sciences (@TS_LifeSciences) January 18, 2023
Announced at #WEF2023 in #Davos , their new campus in Hyderabad will be trailblazing and a wonderful addition to the Innovation ecosystem of Telangana! @MinisterKTR@jayesh_ranjan@ShakthiNagappan https://t.co/j4XAytK9CN pic.twitter.com/CQkGXMN5pd
Bandi Sanjay: ముందస్తుకు మేం కూడా రెడీ, కానీ అదొక్కటే షరతు అంటున్న బండి సంజయ్
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
BRS Parliamentary Party Meet : దేశ ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు, పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయండి - సీఎం కేసీఆర్
Telangana 3వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీకి చివరి స్థానం: మంత్రి హరీష్ రావు
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!