అన్వేషించండి

నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత.. విధి నిర్వహణలో అమరురాలైన వీరనారి

గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య మృతిచెందారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె కన్నుమూశారు.

హైదరాబాద్‌: నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య శనివారం రాత్రి 9:41 గంటలకు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం గత వారం రోజులుగా శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. సౌమ్య మరణం పట్ల నిమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం, సౌమ్యకు వివిధ విభాగాల నిపుణుల ద్వారా అత్యాధునిక లైఫ్ సపోర్ట్, వైద్య సేవలు అందించారు. కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాలు దెబ్బతినడంతో డయాలసిస్,  ఇతర అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


నిమ్స్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత.. విధి నిర్వహణలో అమరురాలైన వీరనారి

అసలేం జరిగింది.. 
జనవరి 23న నిజామాబాద్ జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, గంజాయి ముఠా కారుతో సౌమ్యను ఢీకొట్టి ఆమె పైనుంచి దూసుకెళ్లారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక కిడ్నీని సర్జరీ ద్వారా తొలగించాల్సి వచ్చింది. 

సౌమ్య వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని గతంలోనే మంత్రులు ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 25 ఏళ్ల సౌమ్య 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. గత 20 నెలలుగా నిజామాబాద్‌లో సేవలు అందిస్తున్నారు. కానీ డ్యూటీ చేస్తుండగా ఓ గంజాయి బ్యాచ్ చేసిన అరాచకానికి సౌమ్య ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
Diesel Shortage in AP: డీజిల్ అయిపోయిందని ప్రయాణికుల్ని నడిరోడ్డుపై వదిలేసిన ట్రావెల్స్.. ఇంధన కష్టాలకు ఇదే నిదర్శనం!
డీజిల్ అయిపోయిందని ప్రయాణికుల్ని నడిరోడ్డుపై వదిలేసిన ట్రావెల్స్.. ఇంధన కష్టాలకు ఇదే నిదర్శనం!
Kodandaram and Azharuddin Sworn In as MLCs: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
Advertisement

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Embed widget