అన్వేషించండి

PM Modi Tour: ప్రధాని పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ బలప్రదర్శన

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధానికి ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ ఎక్కడ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ హ్యాష్ ట్యాగ్‌ టాప్‌లో ట్రెండ్‌ అయింది.


హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది. #ShameOnYouKCR, #EqualityForTelangana పేరుతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. 

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఈక్వాలిటీ ఫర్‌‌ తెలంగాణ అంటూ ట్యాగ్‌ చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు, మద్దతుదారులు. దీనికి పోటిగా షేమ్‌ ఆన్‌ యూ కేసిఆర్ అంటూ బీజేపీ నేతలు మద్దతుదారులు ప్రతిదాడి చేస్తున్నారు. వీళ్ల పాలిటిక్స్‌తో ఈ రెండు హాష్‌ట్యాగ్స్‌ ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి.   

ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. వివిధ రంగాల్లో తెలంగాణపైన కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను తమ ట్విట్లతో ఎండగట్టారు. 

కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అందని సహాయం, పునర్విభజన చట్టం హామీలు, తెలంగాణకు దక్కని జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అనేక అంశాల పైన ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ మంత్రులు సైతం ప్రధాని పర్యటన సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నించారు.

కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు కొందరు నెటిజన్లు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైన తమ ప్రభుత్వంతోపాటు మంత్రులు, కేంద్రానికి పంపిన లేఖలపైన ఇప్పటిదాకా స్పందించకపోవడం పట్ల ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. 

కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంపైన చూపిస్తున్న వివక్షను ఎత్తి చూపారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో ఘనంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. 
తనదైన శైలిలో అద్భుతమైన వివిధ కార్యక్రమాలతో పురోగమిస్తున్న తెలంగాణలాంటి అభివృద్ధి  చెందుతున్న రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఆపుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

పలువురు యువకులు తమదైన శైలిలో ట్యాంకుబండు పైన తెలంగాణపైన కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టేలా వివిధ అంశాలతో భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. సుమారు 20 వేలకుపైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయి.

మోదీ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన రోజు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీ, కేంద్రం తీరును తీవ్ర స్థాయిలో కడిగేశారు.

టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారానికి దీటుగా బీజేపీ కూడా ట్విట్టర్‌లో ప్రచారం చేసింది. షేమ్‌ ఆన్‌ యూ కేసీఆర్‌ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో టీఆర్‌ఎస్‌పై విరుచుకు పడ్డారు. 

కేంద్రం ఇస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు బీజేపీ లీడర్లు. రాజా సింగ్ లాంటి వాళ్లు కేసీఆర్, టీఆర్‌ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడుతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget