అన్వేషించండి

Hyderabad News: పాతబస్తీలో ఒవైసీ బిల్డింగ్స్ కూల్చే దమ్ముందా? బుల్డోజర్స్ తెప్పించాలా! ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Hyderabad News | అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా.. పాతబస్తీలోని ఒవైసీ అక్రమ నిర్మాణాలను ఎందుకు నేలమట్టం చేస్తారో చెప్పాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Eleti Maheshwar Reddy | హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సామాన్యులపై మాత్రం ప్రతాపం చూపిస్తోందని, పాతబస్తీలోని అక్రమ కట్టడాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, హైదరాబాద్ సీపీకి ధైర్యం ఉంటే ఒవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలు కూల్చివేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఒవైసీల అక్రమ కట్టడాలను కూల్చడానికి హైడ్రా వద్ద బుల్డోజర్స్ లేకుంటే చెప్పాలని, పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘హైదరాబాద్, జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మీకు దమ్ముంటే పాతబస్తీలోని సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి. గత 20 ఏళ్లుగా సలకం చెరువు, కుంటల భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సలకం చెరువులో ఉన్న ఒవైసీల అక్రమ కట్టడాలు కులగొట్టే దమ్ము, ధైర్యం హైడ్రాకు లేదా? మీ దగ్గర బుల్డోజర్లు లేకుంటే చెప్పండి. పక్క రాష్ట్రాల నుండి తెప్పిస్తాం. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలు కమిషనర్‌కు కనిపించడం లేదా? లేదంటే నేను వచ్చి చూపిస్తా. అవసరమైతే బుల్డోజర్లు లేకుంటే చెప్పండి, పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తా’ అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 

రాష్ట్ర ప్రభుత్వానికి పాతబస్తీపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, అక్కడ ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయి. ఎన్ని ఎకరాలను ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టారనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో కబ్జా అయిన భూముల్ని ఆక్రమించింది ఎవరు, అవి ఎవరి పేరు ఉన్నాయో గుర్తించి చట్ట ప్రకారం కూల్చివేయాలని హైడ్రాను, తెలంగాణ ప్రభుత్వాన్ని మహేశ్వర్ రెడ్డి కోరారు. 13వేల అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎప్పటివరకూ పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చెరువుల భూములు కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

Also Read: Akbaruddin Owaisi: నాపై మళ్లీ తూటాల వర్షం కురిపించండి, కత్తులతో పొడవండి కానీ!: అక్బరుద్దీన్ ఒవైసీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Embed widget