అన్వేషించండి

Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం

Telangana Mass Killing News:రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పోక్సో కేసులో అజ్ఞాతంలోకి వెళ్లి వచ్చిన ఒక నిందితుడు దైవాలగూడలో అర్థరాత్రి సైకోలా రెచ్చిపోయాడు. ఆరుగురిని హత్య చేశాడు. 

Telangana Mass Killing News:రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై ఫోక్సో కేసు పెట్టారన్న కసితో ఒక వ్యక్తి బెయిల్‌పై వచ్చి ఆరుగురిని హత్య చేశాడు. తనపై కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, తన కుటుంబంలోని వారిని అర్ధరాత్రి ఊచకోత కోశాడు.

మే 16 రాజ్‌కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని దైవాలగూడలో ఒక బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. దీనికి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడికి ఈ మధ్య బెయిల్‌ వచ్చింది. బెయిల్ రావడంతో అజ్ఞాతంలో ఉన్న రాజ్‌కుమార్ ఇప్పుడు ఊరిలోకి వచ్చి వీరంగం సృష్టించాడు. వచ్చీరాగానే దైవాలగూడలో చేరుకున్న ఆ వ్యక్తి అర్థరాత్రి బీభత్సం సృష్టించారు.  
 
ఇంత దారుణంగా ఆరుగురిని చంపేసిన రాజ్‌కుమార్ కూల్‌గా తన పేరెంట్స్‌కు ఫోన్ చేశాడు. తనపై అక్రమంగా పోక్సో కేసు పెట్టిన వారిని, సహకరించిన వారిని చంపేసిన నట్టు చెప్పాడు. అంతే కాకుండా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. వాడి మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం చేయాలో తెలియక, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తన కుమారుడు ఇలా అంటున్నాడని చెప్పారు. వారి మాటల విన్న పోలీసుల్లో కంగారు మొదలైంది. ఆరుగురిని చంపేయడం ఏంటని టీం స్పాట్‌కు వెళ్లింది. 

అయితే ఇంతటి దారుణానికి నిందితుడు ఒడిగట్టేందుకు పోలీసులే కారణమని గ్రామస్తులంతా ఆందోళనబాటపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైకి వచ్చి పోలీసుల తీరును తప్పుపట్టారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని చెప్పారు. అందుకే నిందితుడు బరితెగించాడని ఆరోపిస్తున్నారు. 

సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో ఇలాంటి సీన్స్ చూస్తేనే కళ్లు మూసుకుంటాం, లేదంటే ఆ సీన్‌ను స్కిప్ చేస్తాం. కానీ రాజ్‌కుమార్ మాత్రం అర్థరాత్రి చేసిన దుర్మార్గం చెప్పడానికి మాటలు రావు. ఎక్కడ పడుకున్న వారిని అక్కడే కిరాతకంగా నరికి చంపాడు. తనపై కేసు పెట్టిన బాలికను ఊరి చివరకు తీసుకెళ్లి రేప్ చేసి చంపేసినట్టు తెలుస్తోంది. తన భార్య, బిడ్డలను పడుకున్న బెడ్‌పైనే కళ్లు తెరవకుండానే ఆయువు తీసేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను కూడా పడుకున్న చోటే లేవకుండా చేసి గొంతులు కోసేశాడు. 

పోలీసులు స్పాట్‌కు చేరుకొని అక్కడ పరిస్థితులు చూసి షాక్ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

బాలిక ఫిర్యాదు మేరకు మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చిన రాజ్ కుమార్ పదే పదే వార్నింగ్‌ ఇస్తూ వచ్చాడు. తనపై కేసు పెట్టిన వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించాడు.  ఇదే విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చామని గ్రామస్థులు అంటున్నారు. అప్పుడే అతనిపై చర్యలు తీసుకొని ఉంటే, ఆరుగురు ప్రాణాలు దక్కేవి అని అంటున్నారు.                 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget