By: ABP Desam | Updated at : 04 Jul 2022 10:43 AM (IST)
యాదమ్మ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించే ఉద్దేశంతో ఏరికోరి బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం యాదమ్మ అనే సామాన్య మహిళకు ఆ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వంటల్లో చేయి తిరిగిన ఆమె 10 వేల మందికి సైతం సునాయసంగా రుచికరంగా వండిపెట్టగల నేర్పరి. కానీ మోదీకి, మిగతా బీజేపీ అతిథులకు వంటలు చేయాల్సిన బాధ్యతను బండి సంజయ్ యాదమ్మకు అప్పగించారు. అయితే, నోవాటెల్ హోటల్లో యాదమ్మకు అవమానం జరిగిందంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. నోవాటెల్ హోటల్లోని దిగ్గజ చెఫ్లు, ఇంకొంతమంది యాదమ్మను లోనికి రానివ్వలేదని విమర్శలు వచ్చాయి.
వంట మనిషి యాదమ్మను, ఆమె బృందానికి పాస్లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించారని నెట్టింట్లో ప్రచారం జరిగింది. పాస్లు ఉంటేనే హోటల్లోకి అనుమతి ఉంటుందని పోలీసులు కూడా స్పష్టం చేయడంతో యాదమ్మ బృందం రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారని వార్తలు వచ్చాయి.
అయితే, ఈ అంశంపై స్వయంగా యాదమ్మ క్లారిటీ ఇచ్చారు. నోవాటెల్ ప్రాంగణం లోపలికి తనను రానివ్వలేదంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని యాదమ్మ అన్నారు. హెచ్ఐసీసీ వద్దకు రాగానే బండి సంజయ్ కారు పంపించి హోటల్లోకి తీసుకెళ్లారని, తనను తల్లిలాగా అందరూ చూసుకున్నారని చెప్పారు. తాను హోటల్ వరకు రాగానే కొందరు యువకులు తనను కింద కూర్చోమని చెప్పి ఫొటోలు తీసి దుష్ప్రచారం చేశారని, ఆ సమయంలో వారు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదని చెప్పారు. అందుకే తాను కింద కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు.
Yadamma the cook from Karimnagar prepared Telangana cuisine for Prime Minister Narendra Modi #BJPNECInTelangana #BJP #Telangana #MODIINHYDERABAD pic.twitter.com/bwrjUZxNdD
— Sudhakar Udumula (@sudhakarudumula) July 3, 2022
ఆమెనే ఎందుకు?
కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ అనే మహిళ గత మూడు దశాబ్దాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్నారు. ఈమె సొంతూరు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. ఈమెకు 15 ఏళ్లప్పుడే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన వ్యక్తితో వివాహం అయింది. దీంతో కరీంనగర్ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. అప్పటి నుంచి వంటలు చేయడమే జీవనాధారంగా వీరి కుటుంబం ఉంటోంది.
ఈమె చేసే శాకాహార వంటకాలు జిల్లాలో బాగా ఫేమస్ అయ్యాయి. ఏకంగా 10 వేల మందికి సైతం సులువుగా చాలా రుచికరంగా వండి పెట్టేయగల నేర్పరిగా యాదమ్మ పేరు తెచ్చుకున్నారు. గతంలో కరీంనగర్ లో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ కార్యక్రమాలతో పాటు బండి సంజయ్ నిర్వహించిన సమావేశాల సందర్భంగా ఈమెనే వంటలు చేసి పెట్టేది. ఆమె చేతి తెలంగాణ రుచులను తిన్న వారి ద్వారా ప్రశంసలు దక్కాయి. అలా మంచి గుర్తింపు వచ్చింది.
Merit Scholarship: వెబ్సైట్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష హాల్టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
ఇండియాలో మొదటి ఎగ్జిట్ పోల్ సర్వే ఎప్పుడు చేశారు? ఫస్ట్ ఫైవ్ ఇవే
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
తెలంగాణలో రేపే కౌంటింగ్-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?
/body>