అన్వేషించండి

KCR News: జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ - 26 రాష్ట్రాల నుంచి హాజరు, వరుసగా రెండో రోజూ

Pragathi Bhavan: 26 రాష్ట్రాలకు చెందిన 100 మందికిపైగా రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజు జాతీయ రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. దేశంలో వ్యవసాయ రంగం ఏదుర్కొంటున్న సవాళ్లు, పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రైతు సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, విధానాలను కూడా జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ వివరిస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, ఒడిశా సహా 26 రాష్ట్రాలకు చెందిన 100 మందికిపైగా రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు రాష్ట్ర ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చారు.

26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం సమావేశం
శనివారం కూడా సీఎం కేసీఆర్ జాతీయ రైతు సంఘాలతో సమావేశం అయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ప్రజల కోరికలను సంపూర్ణంగా నెరవేర్చలేదని కేసీఆర్ అన్నారు. ప్రజల కోసం పని చేసే వారిని దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వాడుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే అవకాశం ఉన్నా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, కేంద్ర ప్రభుత్వ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. 

శుక్రవారం వీరంతా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌, సింగాయపల్లిలో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్‌కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు, దేశ వ్యవసాయ రంగంలో రావాల్సిన మార్పులు, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సీఎం కేసీఆర్‌ వారికి వివరించారు. వారి అభిప్రాయాలను కూడా సీఎం కేసీఆర్ విన్నారు.

అమెరికా, చైనా కంటే మనకి వనరులు ఎక్కువ - కేసీఆర్
అమెరికా, చైనా లాంటి మనకంటే ముందున్న దేశాలతో పోల్చినా నీటి వనరులు, సాగయ్యే భూమి, రైతులు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. మన దేశంలో సాగు యోగ్యమైన భూమి మొత్తం 40 వేల కోట్ల ఎకరాలు ఉంటే అది మొత్తం సాగు కావడానికి కేవలం 40 వేల టీఎంసీల నీరు కావాల్సి ఉంటుందని అన్నారు. తాగునీటికి మరో 10 వేల టీఎంసీలు సరిపోతాయని అన్నారు. 

మన దేశంలో 70 వేల టీఎంసీల నీటి వనరులు ఉన్నా సాగు నీటికి, తాగు నీటికి దేశ ప్రజలు ఇంకా ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు. అలాగే 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉందని అన్నారు. అయినా, 2 లక్షల మెగా వాట్లను కూడా ఉత్పత్తి చేసుకోలేకపోతున్నామని అన్నారు.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు పుష్కలంగా అందిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్ల ఎందుకు సాధ్యం కావడం లేదని అన్నారు. దేశంలో ఎక్కడైనా తెలంగాణలో ఉన్నట్లుగా రైతువేదికలు ఉన్నాయా? అని అడిగారు. రైతుల ఆత్మహత్యలు దేశంలో ఇంకా ఎందుకు ఉన్నాయని, దానిపై కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి రైతుల కోసం ఇంత సమయం ఇచ్చి మాట్లాడడం దేశంలోనే తొలిసారి అని నిన్నటి (ఆగస్టు 27) సమావేశంలో కేసీఆర్ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget